Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Andhra Pradesh నారాయణ రావు హాట్ కామెంట్స్…

నారాయణ రావు హాట్ కామెంట్స్…

by Prakash
Konakalla Narayana Rao

ఓటమి భయంతో జగన్ మోహన్ రెడ్డి నియోజకవర్గ ఇంచార్జిలను మారుస్తున్నారు కానీ ప్రజలే జగన్ మోహన్ రెడ్డిని మార్చే రోజులు దెగ్గరలో ఉన్నాయని కొనకళ్ల నారాయణరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని పాయింట్లను చెప్పారు.

1) జగన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది. అందుకే అభ్యర్థులను మార్చుతున్నారు.
2) నిన్న ప్రకటించిన 11 మంది ఇంచార్జుల్లో ఒక్కరూ కూడా గెలిచే పరిస్థితి లేదు.
3) ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి నాయకులను మార్చినంత మాత్రాన జగన్ రెడ్డి తలరాత మారదు.
4) దగాకోరు జగన్ రెడ్డి పాపం పండింది. జగన్ రెడ్డి అవినీతి, అక్రమాల మీద ఇప్పటికే ప్రజలు పీకలు దాకా కోపంతో ఉన్నారు.
5) మన భవిష్యత్తుకు గ్యారెంటీతో వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డిని ప్రజలు ఇంటికి పంపడం కూడా గ్యారెంటీ.
6) వైఎస్సార్‌సీపీ 11 మంది ఇంచార్జుల్లో ముగ్గురు మంత్రులు ఉన్నారు. స్థానికంగా వారిపైన వ్యతిరేఖత, అవినీతి ఆరోపణలు, ప్రజలతో సత్సంబంధాలు లేకపోవడమే ఇందుకు కారణం.
7) ప్రజలను మరోసారి మోసం చేసేందుకు వైఎస్సార్‌సీపీ ఇంచార్జుల మార్పుల పేరుతో కొత్త నాటకం ఆడుతోంది.
8) జగన్ రెడ్డి ఇంచార్జులను మార్చుతున్నారు… కానీ ఏపీ ప్రజలు ఏకంగా జగన్ రెడ్డినే మార్చేందుకు సిద్దంగా ఉన్నారు.
9) ఇప్పటి వరకు వైసీపీ నాయకులు చేసినదంతా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను దోచుకోవడం, వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేయడం. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా నాటకాలు ఆడిన వైసీపీ ప్రభుత్వం. అభివృద్ధి మాత్రం శూన్యం.
10) మంగళగిరిలో గెలుస్తారని తెలిసినప్పుడు సీటు రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చి ఓడిపోతారు అని తెలిసినప్పుడు మాత్రం బీసీ సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవికి ఇచ్చారు.
11) బీసీల మీద జగన్ రెడ్డికి ఉన్న కపట ప్రేమకు ఇదే నిదర్శనం.

ఈ కార్యక్రమంలో మోటమర్రి బాబా ప్రసాద్ ,లంకె శేషగిరి ,గోపు సత్యనారాయణ ,బచ్చుల సుబ్రహ్మణ్యం (బోస్),బత్తిన దాస్ ,పీవీ ఫణి కుమార్ ,పామర్తి లక్ష్మణ్, చిల్లిముంత ప్రవీణ్ ,జనసేన నాయకులు భీమవరపు పరమేశ్వర రావు ,ఆళ్ల మాధవ ,బడే రమణ తదితరులు పాల్గొన్నారు.

Advertisements

You may also like

Our Visitor

014176
Total views : 79491

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.