Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home National తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

by Satya
Narendra Modi

లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha elections):

లోక్‌సభ ఎన్నికలు నేపథ్యంలో… తెలంగాణ(Telangana)లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో వరుసగా శుక్ర, శని, సోమవారాల్లో వివిధ చోట్ల బహిరంగసభలు, రోడ్‌షోల్లో పాల్గొంటారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు నగరంలో మోదీ రోడ్‌ షోను నిర్వహించినట్లుగానే ఈసారి కూడా బీజేపీ అదే విధంగా ప్లాన్‌ చేస్తోంది. మూడు పార్లమెంటు నియోజకవర్గాలకు కలిపి ఒక కేంద్రంలో ప్రధాని ఎన్నికల ప్రచారం కొనసాగించేలా రాష్ట్ర పార్టీ ప్రణాళిక రూపొందించింది.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇందుకు అనుగుణంగా మల్కాజ్‌గిరి, సికిందరాబాద్‌, హైదరాబాద్‌ సెగ్మెంట్లకు కలిపి సాయంత్రం 5 గంటలకు మల్కాజ్‌గిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో జరిగే రోడ్‌ షోలో మోదీ పాల్గొంటారు. మీర్జాలగూడ నుంచి మల్కాజ్‌గిరి చౌరస్తా వరకు రోడ్ షో భారీ ఎత్తున నిర్వహించేందుకు బీజేపీ ఏర్పాట్లు చేసింది. మల్కాజ్‌గిరి చౌరస్తాలో ప్రధాని ప్రసంగిస్తారు. అనంతరం, ప్రధాని రాజ్‌భవన్‌కు వెళ్లి బస చేస్తారు.

ఇది చదవండి: సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..!


సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు..
భారత అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. తీర్పుల వెల్లడిలో జరుగుతున్న ఆలస్యాన్ని …
బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు సింగపూర్ కోర్టు షాక్…
ఒకప్పుడు భారత దేశ ఎడ్‌టెక్ రంగాన్ని శాసించిన బైజూస్ సంస్థ ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. …
ఢిల్లీలో తీవ్ర ప్రతికూల వాతావరణం..
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ప్రతికూల వాతావరణం విమాన రాకపోకలను తీవ్రంగా ప్రభావితం చేసింది. భారీ …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

018660
Total views : 89113

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.