దేవల కుప్పం వద్ద ఉన్న యానాది వాడకు చెందిన పలువురు తమ గొర్రెలను మేత కోసం మంగళ వారం అడవికి తీసుకెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఇంటికి చేరుకున్నాక కొన్ని గొర్రెలు కనిపించలేదు. ఈ క్రమంలో గొర్రెలను వెతకడానికి ముగ్గురు గ్రామస్తులు గంగాధరం, సిద్దప్ప, ఈశ్వరయ్యలు కలిసి అడవి మార్గంలో వెళ్లారు. వెళుతున్న దారిలో కొందరు అడవి జంతువుల కోసం విద్యుత్ వైర్లు లాగారు. ఇది గమనించని యానాదులు చీకటిలో విద్యుత్ ఘాతానికి గురయ్యారు. గంగాధర (20)సంఘటన స్థలంలో మృతి చెందాడు. మూడు నెలల క్రితం ఇతనికి వివాహమైనది. అలాగే అతనిని కాపాడే ప్రయత్నంలో సిద్ధప్ప (30) తీవ్ర గాయాలతో పడిపోయాడు. ఇతనిని సదుం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మరో బాలుడు ఈశ్వరయ్య విద్యుత్ ఘాతం నుంచి తప్పించుకుని బయటపడ్డాడు. గ్రామానికి చెరుకున్న ఈశ్వరయ్య వివరాలను వారి కుటుంబ సభ్యులకి తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహంతో పాటు గాయాల పాలైన సిద్ధప్పను మొదట పెద్ద ఉప్పర పల్లి వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం సిద్ధప్పను సదుం వైద్యశాలకు తరలించారు. సంఘటనా స్థలానికి సోమల ఎస్సై వెంకటనరసింహులు చేరుకుని విచారణ చేపట్టారు.
విద్యుత్ ఘాతానికి నవ వరుడు మృతి..
269
previous post





Total views : 78530