Thursday, May 14, 2026
News Navigation
Thursday, May 14, 2026
News Navigation

Breaking

Thursday, May 14, 2026
Home Political ఉపిరి ఉన్నంత వరకు జగనన్న వెంటే..

ఉపిరి ఉన్నంత వరకు జగనన్న వెంటే..

by Rama
Srikanth reddy

అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డి పల్లి మండలంలో పెన్షన్ కానుక కార్యక్రమంలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. తెలంగాణాలో పోటి చేసిన పవన్ కళ్యాణ్ పార్టీ అభ్యర్దులుకు సాధారణ మైన బర్రేలక్క కు వచ్చిన ఓట్లు కుడా ఆ పార్టీకి రాలేదని అటువంటి వారంతా కలిసి వస్తే జగనన్ను ఏమి చేయగలరని ఘాటుగా హెచ్చరించారు. అవ్వ, తాతలు జగనన్న ద్వారా లబ్ది పొందిన ప్రజల ఆదరాభిమానాలు జగన్ మోహన్ రెడ్డి గారికి పుష్కలంగా ఉన్నాయన్నారు. ప్రజల మద్దతు పొందాలి కానీ, నీచమైన రాజకీయాలు చేస్తున్న వారికి సిగ్గు ఉండాలన్నారు. తల్లి కొడుకులు, అన్నాచెల్లెలు మధ్య చిచ్చు పెట్టడమే పనిగా పెట్టుకొన్నారని ఆరోపించారు. తండ్రి చనిపోతే ఎ తప్పు లేనప్పటికీ 16 నెలలు జైల్లో పెట్టినా కుడా కన్నీటి బాధను దిగమింగుతూ ఒక్కడే పోరాడాడు కానీ వీళ్ళ మాదిరిగా నిచమైన రాజకీయాలకు చోటివ్వని దమ్ము, ధైర్యం కలిగిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి చెప్పుకునేందుకు గర్వపడుతున్నాం అన్నారు. ప్రజా సేవే ద్యేయంగా నిజయతే శ్వాసగా బ్రతికేటంటు వాడిగా ఉంటూ చిత్త సుద్ది, ప్రజల మద్దుతుతో రాజకీయాలు చేస్తాను, తప్ప మీ మాదిరిగా పుట కోక రాజకీయం చేసే వాడిని కాదని నా ప్రాణం ఉన్నంత వరకు ఒకే పార్టీలో ఉంటానని వారు స్పష్టం చేశారు. శ్రీకాంత్ రెడ్డి వైసిపికి షాక్ ఇవ్వనున్నాడు, షర్మిలమ్మ పార్టీలోకి వెళ్ళుతున్నారని అటువంటి కథలు రాసిన వారికి సుగ్గు ఉండాలన్నారు. జగన్ మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు ప్రపంచంలో ఏ ఒక్కరు కుడా చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయన్నారు. నీచమైన కథలు రాస్తే నేను ఖండించాలనా.. ప్రజల మధ్య మాట్లాడతాను కానీ.. అనవసరమైన వారి దగ్గర నేను ఏందీ ఖండించ్చేది వేదవల్లారా, మా నాయకుడు ఒక్కడే జగన్ మోహన్ రెడ్డి అని, నా దారి జగన్ మోహన్ రెడ్డి దారి అని గట్టిగా హెచ్చరించారు.

Advertisements

You may also like

Our Visitor

012577
Total views : 75469

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.