తెలంగాణ కేబినెట్ లో మాజీ మావోయిస్టులున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. అట్టడుగు స్థాయి నుంచి ఎదిగొచ్చిన ఆదివాసి బిడ్డను అవమాన పరిచే కుట్ర జరుగుతోందని సీతక్క భావోద్వేగానికి గురయ్యారు. కేబినెట్ లోనక్సలైట్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చింది తానొక్కరే అని, అంత మాత్రానా మొత్తం క్యాబినెట్ కు నక్సలైట్ ముద్ర ఆపాదించడం సరికాదని మండిపడ్డారు. 2004 లో మొదటిసారి తాను ఎమ్మెల్యేగా పోటిచేసినప్పుడు బీజేపీ నాకు మద్దతిచ్చి ప్రచారం చేసిందని, అప్పుడు నా బ్యాక్ గ్రౌండ్ బీజేపీ నేతలకు తెలియదా? అని ప్రశ్నించారు. జనజీవన స్రవంతిలో కలిసాక..నల్లకోటు వేసుకుని లాయర్ గా ప్రజల పక్షనా ఎన్నో కేసులు వాదించానని, భారత రాజ్యాంగం కల్పించిన హక్కులతోనే మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని తెలియజేశారు. బండి సంజయ్ తన వ్యాఖ్యలను తక్షణం వెనక్కు తీసుకోవాలని సీతక్క డిమాండ్ చేశారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట రామాలయంలో అఖండ దీపం.700 ఏళ్లుగా అఖండంగా వెలుగుతున్న దీపం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని రామాలయంలో ఉన్న ఈ దీపాన్ని దర్శించుకునేందుకు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. సీనియర్ సినీ నటులు, దర్శకుడు, న్యాయవాది సివిఎల్…
- అమరావతిలో అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి నారాయణ.అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించిన మంత్రి నారాయణ.. అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించిన మంత్రి, అమరావతిపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు.రాజధాని కోసం భూములు ఇచ్చిన ప్రతి రైతుకూ ప్లాట్లు…
- మంత్రి నారాయణతో భేటీ అయిన సీఆర్ఆర్ఐ ప్రతినిధులు.మంత్రి నారాయణతో సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధులు భేటీ అయ్యారు. అమరావతిలో ఎల్పీఎస్ జోన్లు నిర్మిస్తున్న సీఆర్ఆర్ఐ రోడ్లను స్టడీ చేస్తున్నారు. రెండ్రోజులపాటు జోన్లలో ఇంటర్నల్ రోడ్లు, డ్రెయిన్లు, పవర్ లైన్లు అధ్యయనం చేశారు. ఎల్పీఎస్ జోన్-2, 5, 9,…
- మాజీ సీఎం జగన్ పై హోం మంత్రి అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఏ ఆత్మ చెప్తే.. జగన్ 9 నెలల తర్వాత విషప్రచారం మొదలుపెట్టారంటూ వ్యాఖ్యానించారు. గుడ్డ కాల్చి ముఖాన వేస్తే తుడుచుకునే…
- జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. మహాకవి గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన రచనను ఆ పోస్టులో షేర్ చేశారు. ఆ పోస్టులో.. ‘ ఏ రస్తా యుద్ధాలు చేస్తుందో..ప్రాణాల్ని ఆటబంతుల్లా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 92161