తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు గడువు ముగిసింది. పలు పార్టీలు చివరి నిమిషంలో అభ్యర్థులను మార్చడం… చివరి నిమిషంలో టిక్కెట్లు కేటాయించిన కారణంగా కొంతమంది హడావుడిగా నామినేషన్లు దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి వెళ్లి వరుసలో నిలుచున్న అభ్యర్థులకు నామినేషన్ దాఖలు చేయడానికి అనుమతి ఇచ్చారు. ఆయా పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 13వ తేదీన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ఉంటుంది. 15వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.
Politics
మధిర అసెంబ్లీకి మొత్తం 27 సెట్ల నామినేషన్ దాఖలు. మల్లు భట్టి విక్రమార్క (CONGRESS)-4సెట్లు లింగాల కమల్ రాజ్ (BRS)-3 సెట్లు పెరుమాలపల్లి విజయ్ రాజు (BJP)-1 బొమ్మర రామ్మూర్తి (ఇండిపెండెంట్)-2 సెట్లు బలవంతపు కళ్యాణ్ కుమార్( పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా )-1 పాలడుగు భాస్కర్ (CPM)-3సెట్లు మందూరి శారద (BSP)-1 సెటు మార్కపుడి రాందాస్(CPI)-1 సెటు ఇనపనూరి రెబన్ ప్రదీప్ కుమార్(INDEPENDENT)-1 కనకపుడి నాగేశ్వరరావు ( యువతరం పార్టీ)-1 కనకపుడి స్టాండ్లీ జనాతన్ ( భారత్ సమాజ్ డెవలప్ పార్టీ)-1 చిలకబత్తిని స్టాలిన్ (INDEPENDENT)-1 మద్దెల ప్రభాకర్ రావు (CPM MATRIX)-1 తడకమళ్ళ నరసింహారావు (INDEPENDENT)-1 కొత్తపల్లి బాబు (INDEPENDENT)-1 జంగం రామచంద్రయ్య(INDEPENDENT)-1 కళ్యాణం రమేష్(INDEPENDENT)-1 అంబోజి బుద్ధయ్య( ఏలియన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ)-1 సెట్దొంతమాల కిషోర్ ( ఇండియన్ ప్రజా కాంగ్రెస్)-1 సెట్
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా దేవరకద్ర బాలన్న నామినేషన్ దాఖలు చేశారు… అనంతరం మీడియా తో మాట్లాడుతూ బిజెపి సిద్ధాంతాలకు కట్టుబడుతూ వార్డ్ నెంబర్ స్థాయి నుండి కార్పొరేటర్ స్థాయికి ఎదిగానన్నారు. నియోజకవర్గంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ అనేక సేవా కార్యక్రమాలను కూడా చేయడం జరిగిందన్నారు. బడుగు బలహీన వర్గాలకు టికెట్ ఇవ్వకుండా కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు మోసం చేశాయన్నారు. బిజెపి టికెట్టు బీసీలకు వస్తుందని ఆశాభవం వ్యక్తం చేశారు. ఒకవేళ టికెట్ రాకుండా స్వతంత్ర అభ్యర్థిగా ఖచ్చితంగా బరిలో ఉంటాను అన్నారు. భారతీయ జనతా పార్టీ దేవరకద్ర నియోజకవర్గంలో బీసీలకు అవకాశం కల్పిస్తుందని ఆశ భావం వ్యక్తం చేశారు.
మంచిర్యాల జిల్లాకు పిసిసి అధ్యక్షుడు సభలో పాల్గొననున్నారు…!బెల్లంపల్లికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రానున్నారు. ఇందుకు సంబంధించి పాత బస్టాండ్ ఏరియాలోని సింగరేణి తిలక్ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ సభా ఏర్పాట్లు పూర్తి చేసారు నియోజకవర్గం నుండి జనాన్ని సభకు తరలించానున్నారు ట్రాఫిక్ ను నీవరించడానికి పోలీస్ లు అన్ని విధాలా చర్యలు చేపట్టారు
నామినేషన్ల దాఖలుకు నేడు శుక్రవారం చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థు వ్యర్థి,లకు సంబంధించి మరో సెట్ నామినేషన్లు, స్వంతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేసే అవకాశం ఉంది. శనివారం నుంచి నామినేషన్ల ఉపసంహరణ, పరిశీలనలో తిరస్కరణ ఆతర్వాత ఎన్నికల బరిలో ఉన్న తుది పోటీదారుల జాబితా వెల్లడవుతుంది. దీంతో ప్రచార వేడి ఊపందుకోనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీ లైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ తదితర పార్టీల అభ్యర్థుల ప్రకటన వెలువడింది. అన్నీ పార్టీల్లోనూ నామినేషన్ల ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఇక ఓట్ల కోసం అభ్యర్థుల ప్రచారం ముమ్మరం కానుంది.
మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రైవేటీకరణను ప్రోత్సహించింది బిఆర్ఎస్ ప్రభుత్వమని పార్లమెంటులో 13 మంది ఎంపీలు సంతకం చేయగా ప్రైవేటీకరణ చేయడం జరిగిందని దానిలో బాల్క సుమన్ కూడా ఒక ఎంపీ అని ఈరోజు ప్రైవేటీకరణ ఆపామని వాక్యానించడం పలు ఆశ్చర్యానికి గురి చేస్తుందని బుధవారం ఐ ఎన్ టి యు సి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి intuc యూనియన్ నాయకులు జనక ప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….బాల్క సుమన్ కెసిఆర్ కు ఒక పాలేరుగా ఉంటూ ప్రజలను మభ్యపెడుతూ చెన్నూర్ నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తున్నాడని అన్నారు.రాష్ట్రంలో కేసీఆర్ సీఎంగా ఉంటూ నియంత పాలన సాగిస్తున్నాడని, కుటుంబ పాలన సాగుతుందని తెలిపారు. వీరి ఆధ్వర్యంలో భారీ చేరికలు జరగగా కండువాలు కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. అనంతరం intuc జనక్ ప్రసాద్ మాట్లాడుతూ…..సింగరేణిలో ఒక్క బొగ్గుభాయి కూడా తవ్వని అసమర్థ సీఎం కేసీఆర్ అని బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక 80000 మందికి ఉద్యోగాలు లేకుండా చేశారని పది అండర్ గ్రౌండ్ మైంన్ డ్లను ప్రారంభిస్తానని చెప్పి ఒక్క మైన్ కూడా తవ్వలేదని 20000 ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒక్క ఉద్యోగం కూడా ఇప్పియ్యలేదని ఇన్కమ్ టాక్స్ రద్దు చేస్తానని చెప్పి రద్దు చేయలేదని పేర్లు మార్పిడి చేస్తానని చేయలేదని ఒక భారతదేశంలో కాదు ఇండోనేషియా ఆస్ట్రేలియాల కూడామైన్స్ ఓపెన్ చేస్తానని చెప్పి ఒక్క హామీని కూడా నెరవేర్చే లేదని చెప్పారు. ప్రజా ఆశీర్వాద సభలో మేము అధికారంలోకి వస్తే టాక్సీని రద్దు చేసి ప్రభుత్వమే భరిస్తుందని చెప్పగా నువ్వు చేయాలనుకుంటే అధికార పార్టీ ముఖ్యమంత్రి గానే ఉన్నావు కదా రద్దు చేయాలని అనుకుంటే ఒక్క నిమిషం పని అని అన్నారు.తెలంగాణ వస్తే కొత్త ఉద్యోగాలు వస్తాయని ఆశించిన యువకులకు నిరాశ ఎదురయిందని రాబోయే రోజుల్లో కేసీఆర్ మళ్ళీ అధికారం చేపడితే పాత రోజులు వస్తాయని గడిల పాలన మొదలవుతుందని ప్రజలు బానిసలుగా బతకాల్సి వస్తుందన్నారు.ఇకనైనా సింగరేణి సమస్యలు నెరవేరాలంటే ఈ సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ ని గెలిపించుకోవాలని ముఖ్యంగా చెన్నూరు నియోజకవర్గంలో వివేక్ వెంకటస్వామిని గెలిపించి వారి తండ్రి అయిన వెంకటస్వామి ప్రజల కార్మికుల పక్షాన నిలబడి సమస్యలను పరిష్కరించారో అలాగే వివేక్ వెంకటస్వామి కూడా ప్రజల పక్షాన నిలబడి సమస్యలు పరిష్కరించేలా చూడవలసిన బాధ్యత ప్రజల పైనే ఉందని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నచో సమస్యలన్నీ నెరవేరుస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే విప్ నల్లాల ఓదెలు,కాంపెల్లి సమ్మయ్య,దేవి భూమయ్య, పాల్గొన్నరు
మంచిర్యాల జిల్లా చెన్నూర్ లో పొద్దున ఓ పార్టీ కండువా కప్పుకొని, ఇచ్చిన కమిట్మెంట్ సరిపోక కొద్ది గంటల వ్యవధిలోనే మరో పార్టీ కండువా కప్పుకొని ఆ గట్టునుంటావా,ఈ గట్టునుంటావా అన్న చందంగా తయారయ్యారు ఇక్కడి ఓటర్లు… తాజాగా చెన్నూర్ పట్టణానికి చెందిన టప్ప రాము స్థానికంగా మిర్చి బండి వ్యాపారం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు..అయితే అతను గత కొద్ది రోజులుగా బీజేపీ పార్టీలో ఉంటూ పార్టీ కోసం కష్టపడుతూ వున్నాడు..అనూహ్యంగా బీజేపీ పార్టీలో నుండి వివేక్ వెంకటస్వామి గత కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయన సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన రాము కొద్ది గంటల వ్యవధిలోనే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చెరకు సర్వోత్తమ్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొని బీఆర్ఎస్ పార్టీకి నినాదాలు చేసాడు..కొద్ది రోజుల క్రితమే బీఆర్ఎస్ 17 వ వార్డు కౌన్సిలర్ నాయిని శ్యామల భర్త సతీష్ రాత్రి కాంగ్రెస్ కండువా వేసుకొని తిరిగి తెల్లారే స్వంత గూటికి చేరిన విషయం మనకు తెలిసిందే…ఏది ఏమైనా కండువాల మార్పు కహానితో ఆయా పార్టీల అభ్యర్థులకు ఎవరు మనవారో,ఎవరు ఎటు పోతారో తేల్చుకోలేక తలలు పట్టుకుంటున్నారు….
కాంగ్రెస్ అహంకారాన్ని ఓడిద్దామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు పిలుపునిచ్చారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు ఆ పార్టీ ఇతర నాయకులు విపరీతమైన అహాన్ని ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అంటే ఆత్మీయత… కాంగ్రెస్ అంటే అహంకారమని అన్నారు. కాంగ్రెస్ లో ఒక్క కుర్చీ కోసం నాయకులు కొట్టుకుంటారని, ఇక కాంగ్రెస్ కు ప్రజల గురించి ఆలోచించే సమయం వారికి ఎక్కడ ఉంటుందని అడిగారు. తమ సీఎం అభ్యర్థి సీఎం కేసీఆర్… మరి కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలన్నారు. ఒక్క అవకాశం ఇవ్వాలని అడుగుతున్న బీజేపీ ఆరు సార్లు అవకాశమిస్తే నిజామాబాద్ కు ఎం చేసిందని నిలదీశారు. నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గణేష్ గుప్తాతో కలిసి కవిత గారు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన తీరు గురించి కార్యకర్తలకు సలహాలు, సూచనలు ఇచ్చారు. గత పదేళ్ల కాలంలో తమ పార్టీ ప్రతీ ఒక్కరి సంక్షేమానికి, బాగు కోసం పనిచేశామని, కానీ ఎప్పుడూ అహంకారాన్ని ప్రదర్శించలేదని తెలిపారు. ఎప్పుడూ ఏమీ చేయని కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీలు చెప్పలేనంత అహంకారాన్ని ప్రదర్శిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వేదిక వద్ద కార్యకర్తలను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తంతున్న వీడియోను చూశానని, గతంలో కొడుతున్న వీడియోను చూశామని వివరించారు. ఉస్మానియా విద్యార్థులను అడ్డమీది కూలీలని కూడా రేవంత్ రెడ్డి దూషించారని, రైతులకు మూడు గంటల కరెంటు చాలని అన్నారని, ఇలా విపరీతమైన అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా ఆత్మీయంగానే ఉన్నామని, ఇప్పుడూ అలానే ఉంటున్నామని చెప్పారు. బీఆర్ఎస్ అంటే ఆత్మీయత అని, కాంగ్రెస్ అంటే అహంకారమని అన్నారు. బీఆర్ఎస్ మన ఇంటి పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ మన మంచికోరే పార్టీ కాదని తెలిపారు. తెలంగాణ ఇవ్వడానికి 60 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అరిగోస పెట్టిందని, సీఎం కేసీఆర్ దీక్ష చేస్తే ఇచ్చినట్టే ఇచ్చి మళ్లీ వెనక్కి తీసుకుందని, చివరికి వందలాది మంది తెలంగాణ బిడ్డలను పొట్టనపెట్టుకున్న తర్వాత తెలంగాణ ఇచ్చిందని వివరించారు. “కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏక్ అనార్ హై సౌ బిమార్ హై” అన్నట్లుగా ఉంటుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ లో ఒక్క కుర్చీ కోసం అనేక మంది కొట్టుకుంటారని, కానీ తాము మాత్రం తమ సీఎం అభ్యర్థి సీఎం కేసీఆర్ అని గర్వంగా చెబుతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరని ప్రశ్నించారు. కుర్చీ కోసం కొట్లాటకే కాంగ్రెస్ నాయకుల సమయం సరిపోదని, ఇక ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి ఆ పార్టీ నాయకులకు లేదని అన్నారు. బీఆర్ఎస్ బలమైన పార్టీ అని, కాబట్టి తప్పకుండా మూడో సారీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని బీజేపీ చెబుతోందని, కానీ ఆరు సార్లు అవకాశం ఇస్తే అవకాశం ఇచ్చినా చేయని పనులు కొత్తగా ఏమి చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి 54 ఏళ్లు అవకాశం ఇచ్చినా ఏమీ చేయలేదని విమర్శించారు. గుణమున్న గణేష్ కావాలా లేదా ధనమున్న ధన్ పాల్ కావాలా అన్నది నిజామాబాద్ తేల్చుకోవాలని, గుణమున్న గణేష్ గుప్తాను ప్రజలు గెలిపించుకుంటారన్న సంపూర్ణ విశ్వాసముందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ డీఎన్ఏలోనే గుణముందని తెలిపారు. ప్రజల కోసం మంచి చేసే వ్యక్తి గణేష్ అని చెప్పారు. నిజామాబాద్ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపించారని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం సీఎం కేసీఆర్ ను ఒప్పించి రూ. 45 కోట్లు తెచ్చారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అంటే పుష్పక విమానమని, ఎంత మంది వచ్చినా స్వాగతించామని, ఇంకా రావాలన్న కూడా స్థలముందని, అంత పెద్ద పార్టీ తమదని స్పష్టం చేశారు. డివిజన్ వారీగా సమన్వయం చేసుకోవాలని, తద్వారా ప్రతీ గల్లీలో తమకు ఎదురు ఉండదని స్పష్టం చేశారు. కనీసం 55 వేల మెజారిటీతో గణేష్ గుప్తాను గెలిపించడానికి కృషి చేయాలని కార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు
పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని స్థానిక 20 వ వార్డ్ లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ చదలవాడ అరవింద బాబు ఇంటింటికి తిరిగి వైసీపీ ప్రభుత్వ పాలనలో సామాన్య ప్రజలు పడుతున్న బాధలను కష్టాలను అడిగి తెలుసుకొని వారి అభిప్రాయాలను నమోదు చేసుకున్నారు. చదలవాడ అరవింద్ బాబు కామెంట్స్…. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నీతి నిజాయితీగల మనిషి అని. యువతకి రైతులకి మంచి భవిష్యత్తు కావాలి అంటే అది బాబు వల్లే అవుతుందని అన్నారు.. నాలుగున్నరేళ్ల జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి లేదు,సంక్షేమం లేదు,ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయని అన్నారు.. టిడిపి మేనిఫెస్టో ద్వారా చంద్రబాబు నాయుడు ప్రజలకు అనేక హామీలు ఇవ్వడం జరిగిందన్నారు…మహిళల కోసం మహాశక్తి కార్యక్రమం తెస్తామని,ఇంట్లో ఎంతమంది మహిళలు అంటే అంతమందికి ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మహిళలు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అండదండలతోనే అక్రమాలు జరుగుతున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి కే. నారాయణ ఆరోపించారు. బీఆర్ఎస్ చేస్తున్నదంతా అక్రమాలు, అన్యాయాలే.ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ కి బీజేపీకి వ్యతిరేకంగా ఉండే పార్టీలతోనే మేము కలుస్తాం.బీజేపీని వ్యతిరేకించే వాళ్ళు ఈ భూమి మీద ఉండడకూడదనేది మోడీ తత్వం.బీజేపీని వ్యతిరేకించిన వారిపై సీబీఐ, ఈడీ దాడులు నిర్వహిస్తున్నారు.కేవలం పగసాధింపు చర్యలే పనిగా పెట్టుకున్న బీజేపీ,టీఆర్ఎస్ రెండు కలిసే కాంగ్రెస్ పై కుట్ర చేస్తున్నాయి. వైసీపీ, బీజేపీ, తెరాస మూడు ఒకే దారిలో దొడ్డిదారిన నడుస్తున్నాయి. లిక్కర్ స్కామ్ అంతా వైసీపీ, టీఆర్ఎస్, బీజేపీ కలిసే చేస్తుంటే పేరుకు మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీపై చెపుతున్నారని సీపీఐ నారాయణ మండిపడ్డారు.






Total views : 150334