Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Andhra PradeshChittoor సినిమా షూటింగ్ లో రచ్చ రచ్చ..

సినిమా షూటింగ్ లో రచ్చ రచ్చ..

by Rama
Mythri Movies

తిరుపతి గరుడ సర్కిల్ లో తమిళ తెలుగు చిత్ర షూటింగ్ వివాదానికి కారణమైంది, ఉదయం 7 నుంచి 10 గంటల సమయం మధ్యలో మైత్రి మూవీస్ మేకర్ పై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున హీరోలుగా నటిస్తున్న ఓ చిత్రం షూటింగ్ సంబంధించి గరుడ విగ్రహం ఎదురుగా యాక్సిడెంట్ సీన్ చిత్రీకరించారు. అయితే అదే సమయంలో తిరుమలకు వెళ్లే భక్తులకు పూర్తిగా ఇబ్బంది ఏర్పడింది. మరోవైపు ఇటు పాఠశాలకు వెళ్లే విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బంది పడ్డారు. సుమారు గంటపాటు ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి తిరుమలకు వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనితోపాటు ఆ ప్రాంతంలో సినిమా షూటింగ్ నుంచి చిత్రీకరిస్తున్న యూనిట్ సెల్ఫోన్తో చిత్రీకరిస్తున్న వారిపై దాడులకు సైతం పాల్పడ్డారు. ముఖ్యంగా గరుడా విగ్రహం ఎదుట యాక్సిడెంట్ సీన్ చిత్రీకరించడాన్ని అందరూ తప్పుపడుతున్నారు. మరోవైపు పోలీసులు పవిత్రమైన గరుడ సర్కిల్లో ఏవిధంగా అనుమతిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు గరుడ సర్కిల్ వద్ద నిరసన తెలియజేయడానికి కూడా అనుమతించిన పోలీసులు అధికారులు ఇప్పుడు షూటింగ్ కి ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారని ఆరోపిస్తున్నారు.

Advertisements

You may also like

Our Visitor

019453
Total views : 90742

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.