నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించాలని ఇండియా కూటమి నేతల నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సమర్థించారు. అది వారి హక్కు అని స్పష్టం చేశారు. ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు, డీఎంకే సీఎం స్టాలిన్ నీతి ఆయోగ్ భేటీని బహిష్కరించారని గుర్తుచేశారు. బహిష్కరించిన నేతలు ఆయా ప్రాంతాలకు బడ్జెట్ లో ఏమీ కేటాయించలేదని వారు మీటింగ్ కు వచ్చి సమయాన్ని ఎందుకు వృథా చేసుకోవాలని అని అన్నారు. సంకీర్ణ భాగస్వాములను సంతృప్తి పరచడానికి బిహార్, ఆంధ్రప్రదేశ్ లకు అనుకూలంగా బడ్జెట్ ప్రవేశపెట్టిందని కేంద్రంపై మండిపడ్డారు. ‘విద్య, ఆరోగ్యం రంగాలకు బడ్జెట్ తగ్గిపోయింది. ఇది రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు. తమ సంకీర్ణ భాగస్వామ్యుల కోసం ప్రభుత్వం రాజకీయాలు చేసిందని మండిపడ్డారు. బీహార్ రాష్ట్రానికి లభించింది తమ రాష్ట్రానికి వస్తే సంతోషిస్తాం. బిహార్ లో హైవేల కోసం రూ.26వేల కోట్లు కేటాయించారు. ఇది చిన్న విషయం కాదు. బిహారీలకు మంచిదే. అయితే, కర్ణాటను కాస్త పట్టించుకోండి. బెంగుళూరులో హైవేలు, టన్నెల్స్ కోసం నిధులు కావాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కానీ వారికి ఏదీ దక్కలేదు. ఇది కేవలం రాజకీయవ్యూహమే అని నీతి ఆయోగ్ సమావేశంపై శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేసారు .
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..ఏలూరు కలెక్టరేట్ సాక్షిగా హైడ్రామా నడిచింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కాస్తా… అధికారులకు, వైకాపా నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదానికి వేదికగా మారింది. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి కళ్లెదుటే వైకాపా నాయకులు, ఏలూరు మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్…
- వరంగల్లో డీఆర్ఐ అధికారుల సంచలన ఆపరేషన్..వరంగల్లో అంతర్జాతీయ స్మగ్లర్ల తరహాలో సాగుతున్న వన్యప్రాణుల అక్రమ రవాణా గుట్టును డిరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు రట్టు చేశారు. గ్రే మార్కెట్లో అత్యంత ఖరీదైన, అంతరించిపోతున్న అరుదైన సజీవ పాములను విక్రయిస్తున్న ఒక ముఠా సభ్యుడిని సినీ ఫక్కీలో…
- పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..సరికొత్త ఆదర్శానికి వేదికైంది శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్. ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ కేవలం మాటలకే పరిమితం కాదని స్వయంగా ఆచరించి చూపించారు జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్. సోమవారం కలెక్టరేట్లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక…
- Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..పంజాబ్ కింగ్స్కు ఇది వరుసగా 6వ ఓటమి, దీంతో వారి సీజన్ పూర్తిగా తలకిందులైంది. ప్లేఆఫ్స్ రేస్ వేడెక్కుతున్న ఈ సమయంలో ఇది Chennai Super Kings, Kolkata Knight Riders, Rajasthan Royals మరియు బహుశా Delhi Capitals వంటి…
- Delhi Capitals అద్భుత ఫినిష్తో ఉత్కంఠ పోరులో విజయం..ఈ మ్యాచ్లో ఆతిథ్య జట్టు స్వల్ప తేడాతో విజయం సాధించింది. అబిషేక్ పోరెల్ మరియు KL రాహుల్ తమ జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. పవర్ప్లేలో 72 పరుగులు వచ్చాయి, 10వ ఓవర్ ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ 105/0 వద్ద…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 80371