372
అసెంబ్లీలో రెండో రోజు బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై చర్చ పరస్పర విమర్శలకు దారి తీసింది. ఆటోడ్రైవర్ల సమస్య అంశంపై కాంగ్రెస్ను బీఆర్ఎస్ టార్గెట్ చేసింది. అయితే హరీష్ రావుపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. మహిళలకు ఉచిత బస్సు కావాలా వద్దా చెప్పాలని బీఆర్ఎస్ నేతలను డిమాండ్ చేశారు. బస్సుల్లో మహిళలు ఉచితంగా తిరిగితే మీకేం సమస్య అని నిలదీశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం బీఆర్ఎస్ నేతలకు ఇష్టం లేదన్నారు. భావోద్వేగాలు రెచ్చగొట్టడమే బీఆర్ఎస్ నేతల నైజమని సీతక్క మండిపడ్డారు.





Total views : 90591