Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home Andhra Pradesh శ్రీశైలం ఆలయ ప్రసాదంలో చికెన్ ముక్క…

శ్రీశైలం ఆలయ ప్రసాదంలో చికెన్ ముక్క…

by Prakash
శ్రీశైలం

Srisailam :

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి దేవస్థానంలో మహా అపచారం చోటుచేసుకుంది. స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం అమ్మవారి గుడి వెనుక భాగాన గల తీర్థ ప్రసాదాల వితరణ వద్ద పులిహోర ప్రసాదంలో మాంసపు ముక్క ప్రత్యక్షం కావడంతో ఆలయ అధికారులపై భక్తులు తీవ్ర అసహనానికి గురయ్యారు. హైదరాబాద్ నుంచి వచ్చిన వేణుగోపాల్ అనే భక్తుడు ఉదయం 11.53 నిమిషాలకు స్వామి అమ్మవార్ల దర్శనం ముగించుకొని అమ్మవారి ఆలయ వెనుక భాగంలో ప్రసాదం తీసుకున్నప్పుడు ప్రసాదంలో కనిపించిన మాంసపు ముక్కను చూసి ఒక్కసారిగా ఆందోళన చెందారు. దైవ దర్శనం కోసం వచ్చి మాంసపు ముక్కను కలిపిన ప్రసాదాన్ని తినడం అపచారంగా భావించిన భక్తులు ఆలయ పరిపాలన భవనంలో ఆలయ ఏఈవో హరిదాసు మరియు ఆలయ సహాయ కమిషనర్ హెచ్ వెంకటేష్ కి లికిత పూర్వక ఫిర్యాదు ఇవ్వడంతో పాటు మాంసపు ముక్కను కూడా అందజేయడం జరిగిందని భక్తుడు వేణుగోపాల్ తెలిపారు. ఆలయ అధికారుల నిర్లక్ష్యము మరియు సుచి శుభ్రత లేని ప్రసాద వితరణ మా మనోభావాలను భారీగా దెబ్బతీశారు అంటూ ఆందోళన చెందుతున్న భక్తులు తక్షణమే నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు మరియు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేశారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: