ఇటీవల చైనాలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ 107 పతకాలు సాధించిన భారతీయ క్రీడాకారులు హస్టరీ క్రియేట్ చేసింది అదే దారిలోనే చైనాలో జరుగుతున్న పారా ఆసియా క్రీడల్లోనూ ప్లేయర్లు సత్తా చాటారు. ఈ గేమ్స్ ప్రారంభమైన నాలుగు రోజుల్లోనే భారత్ అన్ని కలిపి 73కు పైగా పతకాలను సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. కాగా, ఇవాళ పారా ఏషియన్ గేమ్స్లో 100 పతకాలు సాధించి చరిత్ర క్రియేట్ చేశారు. 2018 లో జరిగిన టోర్నీలో భారత్ మొత్తం 72 పతకాలను మాత్రమే అత్యధికంగా గెలుచుకొగలిగింది. అయితే ఇవాళ కూడా మరిన్ని పతకాలు వచ్చే అవకాశం ఉంది. కాగా, పారా ఆసియా గేమ్స్లో వంద పతకాలు సాధించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ట్విట్టర్ వేదికగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. భారత్ పారా ప్లేయర్లకు శుభాకాంక్షలు తెలిపారు.
Tag:
Asian Games
ఏషియన్ గేమ్స్లో పతకాలు సాధించిన ఏపీ క్రీడాకారులు కోనేరు హంపి, బి.అనూష, జ్యోతి యర్రాజీ సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ను కలిశారు. క్రీడాకారులు వారు సాధించిన పతకాలను సీఎంకు చూపించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ అంతర్జాతీయ వేదికలపై తెలుగు వారి ఖ్యాతిని నిలబడినందుకు చాలా ఆనందంగా ఉందని క్రీడాకారులను అభినందించారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడలలో పతకాలు సాధించిన క్రీడాకారులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని సీఎం జగన్ అన్నారు. క్రీడలకు మరింతగా ప్రాధాన్యతనిస్తూ సీఎం వైఎస్ జగన్ స్పోర్ట్స్ పాలసీ ప్రకారం క్రీడాకారులకు ఇచ్చే నగదు పురస్కారాన్ని విడుదల చేశారు.





Total views : 140939