అల్సర్ లతో బాధపడేవారికి అరటి పండ్లను తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. డయాబెటిస్ రాకుండా, బీపి కంట్రోల్ లో ఉండేలా చేయగలిగిన శక్తి అరటిపండులో ఉందని చెబుతున్నారు. అధిక ఫైబర్, ప్రోటీన్లు ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల డయాబెటిస్ కు చెక్ పెట్టొచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఇక డయాబెటిస్ బాధితులు కూడా అరటి పండ్లను తినొచ్చు అని అయితే బాగా మిగల పండిన అరటి పండ్లను తినకూడదు అని చెబుతున్నారు. అరటి పండ్లను తినడం వల్ల క్యాన్సర్ రిస్క్ నుండి కూడా కాపాడుకోవచ్చని, చర్మ సంబంధమైన సమస్యల నుండి కూడా బయట పడవచ్చని చెబుతున్నారు. శరీరానికి అరటిపండు నిగారింపును ఇస్తుంది అని, జుట్టు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది అని చెబుతున్నారు.
BP
చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే చేపల్లో బీపీని, కొలెస్ట్రాల్ ని, డయాబెటిస్ ని కంట్రోల్ చేసే గుణాలు ఉంటాయి. అంతేకాకుండా చేపల్లో నాణ్యమైన ప్రోటీన్లు ఉంటాయి. వారానికి రెండుసార్లు చేపలు తినడం వల్ల గుండె జబ్బులు, డయాబెటిస్, బీపీ, మెదడు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం తక్కువ. చేపలని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదు. నిరోధక శక్తి పెరగడానికి కూడా చేపలు ఎంతో దోహదపడుతాయి. చేపలు శరీరానికి చాలా అవసరం ఎందుకంటే చేపల్లో మంచి కొవ్వు ఉంటుంది. అంతేకాకుండా చేపల్లో ఒమేగా – 3 ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. కడుపులో మంట, వేడి తగ్గాలన్న తప్పనిసరిగా చేపలు తీసుకోవాలి. ఇంకా ఆర్థరైటిస్ తో బాధపడే వాళ్ళు చేపలు తినడం వల్ల నొప్పులు తగ్గడమే కాకుండా కండరాల శక్తిని పెంచుతాయి. అలాగే అల్జీమర్స్, డిమెన్షియా, మతిమరుపు వంటి లక్షణాలను చేపలు తగ్గిస్తాయి. చేపల్లో విటమిన్ – డి అధికంగా ఉండటం వల్ల ఎముకలు గట్టిగా ఉండేటట్లు తెలుస్తాయి. అంతేకాకుండా రొమ్ము క్యాన్సర్, ప్రేగు క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్లు రాకుండా చేపలు అడ్డుకుంటాయి. చేపల్లో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలోని గ్లోబిన్ శాతం సరిపడేలా చేస్తుంది. పేగులో క్యాన్సర్ ఇతరత్రా సమస్యలు రాకుండా చేస్తుంది. శరీరంలోని ఉష్ణోగ్రతను క్రమబద్దీకరించి ఎనర్జీగా ఉండేటట్లు చేస్తాయి. అందుకే చేపలను తప్పనిసరిగా తినాలి. చేపల్లో అయోడిన్ ఉండటం వల్ల గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది. కడుపులో బిడ్డకు మెదడు పెరిగేందుకు ఉపయోగపడతాయి. మన శరీరంలో మెగ్నీషియం సరిపడా లేకపోతే చేపలను తినడం వల్ల అది మన శరీరానికి అందుతుంది. దీనివల్ల ఎముకలు ధృడంగా ఉంటాయి. అందుకే చేపలను తప్పనిసరిగా తినాలి. చేపల్లో వుండే పొటాషియం శరీరంలో ద్రవాలు తయారవడానికి చాలా అవసరం. కణాలు సమర్థవంతంగా పనిచేయడానికి పొటాషియం చాలా అవసరం అందుకే చేపలను తినడం వల్ల పొటాషియం అందుతుంది.
సహారా గ్రూపు వ్యవస్థాపకుడు, ఛైర్మన్ సుబ్రతా రాయ్ కన్నుమూశారు. ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రాణాంతక మెటాస్టాటిక్, బీపీ, మధుమేహం వ్యాధులతో దీర్ఘకాలంగా బాధపడుతున్న ఆయన ఈ ఆదివారం కార్డియోరెస్పిరేటరీ అరెస్ట్కు గురయ్యారని, చికిత్స పొందుతూ కన్నుమూశారని ఓ ప్రకటనలో కంపెనీ పేర్కొంది. ఆయన మృతితో కంపెనీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తోందని పేర్కొంది. సుబ్రతా రాయ్కి భార్య స్వప్నా రాయ్, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇద్దరు కుమారులు సుశాంతో రాయ్, సీమాంటో రాయ్ విదేశాల్లో ఉంటున్నారు. సుబ్రతా రాయ్ 1948లో బీహార్లోని అరారియాలో పుట్టారు. 1978లో ‘సహారా ఇండియా పరివార్’ ప్రారంభించడంతో ఆయన సక్సెస్ స్టోరీ మొదలైంది. కేవలం రూ.2,000 మూలధనంతో ప్రారంభినప్పటికీ వ్యవస్థాపకత విషయంలో కంపెనీని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు సుబ్రతా రాయ్ కృషి చేశారు. లక్నోను కేంద్రంగా చేసుకొని కంపెనీ కార్యకలాపాలను నిర్వహించారు. అయితే ‘సహారా చిట్ ఫండ్ స్కామ్’ కేసులో కంపెనీ అనేక సమస్యలను ఎదుర్కొంది. సుబ్రతా రాయ్ మృతిపై ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సహా పలువురు ప్రముఖలు సంతాపం వ్యక్తం చేశారు.





Total views : 61960