ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్(Jagan) గుంటూరు జిల్లా(Guntur District)లో ఎన్నికల ప్రచారం(Election campaign) నిర్వహించారు. చంద్రబాబు(Chandrababu) తనను ఒక బచ్చా అంటున్నాడని, పోయేకాలం వచ్చినప్పుడు విలన్లందరికీ హీరోలు బచ్చాలుగానే కనిపిస్తారని అన్నారు. నేను బచ్చా అయితే… నన్ను చూసి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నాడు? నేను బచ్చా అయితే… నన్ను ఎదుర్కొనేందుకు ఎందుకు పొత్తులు పెట్టుకున్నాడు? అని సీఎం జగన్ ప్రశ్నించారు. ఎన్నికలకు ఒంటరిగా వచ్చి ధైర్యంగా పోరాడుతున్నాను అని జగన్ స్పష్టం చేశారు. చంద్రబాబు అంత పుడింగి అయితే పొత్తులు లేకుండా సింగిల్ గా రావొచ్చు కదా అని సవాల్ విసిరారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏం చేశాడో కూడా చెప్పుకోలేకపోతున్నాడని, చంద్రబాబు అంటే గుర్తుకువచ్చే పథకం ఒక్కటైనా ఉందా అని సీఎం జగన్ విమర్శించారు. మా ప్రభుత్వంలో అమ్మ ఒడి, పెన్షన్లు, ఆసరా, చేయూత, వాహనమిత్ర వంటి పథకాలు తెచ్చామని …. అలాంటివి చంద్రబాబు ఎందుకు అమలు చేయలేదని జగన్ విమర్శించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- అన్నమయ్య జిల్లాలో ఘనంగా విరుపాక్షమ్మ తల్లి పుష్కరోత్సవాలు.అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లిలోని శ్రీ విరుపాక్షమ్మ తల్లి ఆలయంలో పుష్కరోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ నిర్మాణానికి 12 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.మూడు…
- మళ్లీ పెరిగిపోతోన్న కొవిడ్-19 కేసులు.ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి మళ్లీ కలకలం రేపుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొత్తగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. తక్షణమే అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 26వ తేదీ నుంచి…
- అమరావతిలో అసైన్డ్ భూముల వ్యవహారంలో హైకోర్టు సంచలన తీర్పు.అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. గత వైసీపీ హయాంలో సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలపై నమోదైన కేసులను పూర్తిగా కొట్టివేసింది. ఈ కేసులు కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని న్యాయస్థానం తన…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 212529