నల్లగొండ జిల్లా నకిరేకల్ లో గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు యువకులను నకిరేకల్ పోలిసులు అదుపులోకి తీసుకోని అరెస్టు చేశారు. నకిరేకల్ కు చెందిన ముగ్గురు యువకులు గంజాయి విక్రయిస్తుండగా యాదాద్రి జిల్లా అడ్డ గూడూరు మండలం గట్టు సింగారం గ్రామానికి చెందిన మరో ఇద్దరు యువకులు కోనుగోలు చేస్తుండగా వారిని నకిరేకల్ పోలిసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న గంజాయి మరియు సేవిస్తున్నా సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా వీరు జల్సాలకు అలవాటు పడి గంజాయి మత్తుకు బానిసైతున్నారాని. నకిరేకల్ లో మాదకద్రవ్యాలు విక్రయించే స్థావరాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని నకిరేకల్ సిఐ రాజశేఖర్ తెలిపారు.
cvr live
తొమ్మిదో తరగతి చదువుతున్న మైనర్ బాలుడిని ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న అమ్మాయిని ప్రేమిస్తున్నాడని అనుమానంతో అమ్మాయి అన్న అతని ఆరుగురు స్నేహితులు కలిసి మైనర్ బాలుడు మరియు అతని ఇద్దరు స్నేహితులను స్వగ్రామ మైన ముక్తాపూర్ వద్ద పొలం గట్ల మధ్య తీసుకెళ్లి విచక్షణారహితంగా కొట్టడంతో పాటు ఐరన్ రాడులను కాల్చి వాతలు పెట్టారు అర్ధరాత్రి ఐనా పిల్లలు రాలేదని తల్లిదండ్రులు వారికి ఫోన్ చేయడంతో సదరు మైనర్ బాలురను వదిలిపెట్టిన నిందితులు. దెబ్బలను గ్రహించిన తల్లిదండ్రులు మందలించడంతో బయటికి వచ్చిన పూర్తి వ్యవహారం తెలుసుకొని, తెల్లవారుజామున పోలీస్ స్టేషన్లో బాధితుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి ఏడుగురు నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు ప్రస్తుతం చికిత్స పొందుతుండగా బాధితులు. నిందితులు పరారీలో ఉన్నట్టు తెలిపిన భూదాన్ పోచంపల్లి పోలీసులు.
గుంటూరు జిల్లా కు చెందిన రామినేని మహేష్ బాబు(32) ఉద్యోగం నిమిత్తం 8 నెలల క్రితం నగరానికి వలస వచ్చీ రామచంద్రపురం LIG కాలనీ లో నివాసం ఉంటున్నాడు. నగరం లోని ఓ కంపెనీ లో సాప్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న మహేష్ బాబు. పని నిమిత్తం మియాపూర్ కు స్కూటీ పై వెళ్తున్న మహేష్ బాబు ను వెనుక నుండి అతి వేగంగా వచ్చి డీ కొట్టిన డీసీఎం వాహనం. తీవ్ర రక్తస్రావం అయిన మహేష్ బాబు ను చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలింపు. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించిన వైద్యులు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలింపు. భార్య రత్నంబా ఇచ్చిన ఫిర్యాదు తో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే టిడిపి ఇంచార్జ్ జి.శంకర్ యాదవ్ తలపెట్టిన జయహో బీసీ కార్యక్రమానికి పోలీసులు ఆంక్షలు విధించారు. అంగళ్లు లో ర్యాలీలకు ఎటువంటి పర్మిషన్ లేదంటూ అంగళ్లు 30 యాక్ట్ 144 సెక్షన్ అమల్లో ఉందని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. అంగళ్లు కూడలి వద్ద పెద్ద ఎత్తున పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా అంగళ్ళలోని మూడు రోడ్ల కూడలి వద్ద టిడిపి శ్రేణులు చేయబోతున్న కేక్ కటింగ్ కు పర్మిషన్ లేదంటూ ఇక్కడ ఎవరైనా కేక్ కటింగ్ వంటి కార్యక్రమాలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మదనపల్లి రూరల్ సీఐ శివాంజనేయులు బెదిరింపులకు గురి చేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చుండ్రు వీర్రాజు చౌదరి నేతృత్వంలో గొల్లపాలెం నుంచి ద్రాక్షారం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అడుగడుగున లోకేష్ కరపత్రాలు, పోస్టర్లు ఆవిష్కరించారు. అన్నదాన, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. కోటిపల్లి శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోకేష్ ఆధ్వర్యంలో చంద్రబాబు నేతృత్వంలో జనసేన సహకారంతో రెండు పార్టీలు అధికారంలోకి రావాలని కోరుతూ పూజలు నిర్వహించారు. వీర్రాజు చౌదరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కని విని ఎరుగని రీతిలో స్పందన లభించింది. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి తన యువగళం ద్వారా కొత్త ఉత్సాహాన్ని తెచ్చిన లోకేష్ మరింత ఉన్నత స్థితికి ఎదగాలని ఆకాంక్షిస్తూ పూజలు చేసామని అదే విధంగా లోకేష్ ఆసయాలకు అనుగుణంగా అన్నదాన, రక్తదాన శిబిరాలు నిర్వహించమని వీర్రాజు చౌదరి తెలిపారు.
బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నారా లోకేష్ బాబు జన్మదినోత్సవ సందర్భంగా బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వేగేశన నరేంద్ర వర్మ చేతుల మీదుగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా నరేంద్ర వర్మ మాట్లాడుతూ… నారా లోకేష్ యువ గళం అనే పేరుతో రాష్ట్రము మొత్తం చుట్టూ వచ్చి ఆంధ్ర రాష్ట్రం లో యువ గళమే నారా లోకేష్ అనే విధంగా ఆయన పేరు ను మైమరిపించే విధంగా చేశారు. నారా లోకేష్ కి తెలుగుదేశం పార్టీ తరఫున జన్మదినోత్సవ శుభాకాంక్షలు, లోకేష్ బాబు నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయురారోగ్యంతో ఉండాలని పార్టీ శ్రేణుల్లో మరింత ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని నింపాలని వేగేశన కోరారు.
నూజివీడు మండలం రావిచర్ల గ్రామంలో జరుగుతున్న భూ సర్వేలో అవకతవకలు జరుగుతున్నాయంటూ రైతులు ఆరోపిస్తున్నారు. వైయస్సార్ జగనన్న భూ సురక్ష పథకంలో భాగంగా జరుగుతున్న సర్వేలో సుమారు 400 ఎకరాలు భూమిని సర్వే అధికారులు, సిబ్బంది ఎక్కువగా చూపుతున్నారని గ్రామస్తులు తెలియజేస్తున్నారు. గ్రామంలో మొత్తం 2,900 ఎకరాలు ఉండగా, ప్రస్తుతం సర్వే అనంతరం 3,300 ఎకరాలు భూమి ఉన్నట్లు చూపుతున్నారని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న సర్వే వల్ల గతంలో ఉన్న తమ భూమిలో మూడు అడుగుల నుండి 10 అడుగుల వరకు భూమిని కోల్పోతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న భూ సర్వే వలన గ్రామంలో కలహాలకు ఆజ్యం పోస్తున్నట్లు ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామంలో కలిసికట్టుగా ఉన్న రైతులు భవిష్యత్తులో అమ్మకాలు కొనుగోలు జరిగిన సమయంలో, ఇప్పుడు జరిగిన భూ సర్వే వలన కొట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని రైతులు వాపోతున్నారు. నేడు జరుగుతున్న సర్వే వలన కొంతమంది రైతులు తమ భూమిలో కొంత భాగాన్ని కోల్పోతుండగా, మరి కొంతమంది రైతులకు అదనంగా భూమి కలుస్తుందని రైతులు చెబుతున్నారు. గతంలో ఉన్న సర్వే లెక్కల ప్రకారమే తమకు భూములను చూపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇళ్ల స్థలాలు, పొలాల్లో కూడా కొంత భూమిని కోల్పోతున్నట్లు ప్రజలు, రైతులు తెలుపుతున్నారు. తక్షణమే సర్వే పనులు నిలిపివేసి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.
తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పుత్తూరు మున్సిపాలిటీ 17వ వార్డు కౌన్సిలర్ దళిత మహిళ భువనేశ్వరి మీడియా ముందు మాట్లాడారు. పుత్తూరు మున్సిపల్ ఎన్నికల్లో తాను 17వ వార్డు నుంచి ఇనామనస్ గా కౌన్సిలర్ గా ఎన్నికయ్యానని తెలియజేశారు.. 40 లక్షలు ఇస్తే తనకు మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తానని మంత్రి రోజా తమ్ముడు కుమారస్వామి తెలిపారని పేర్కొన్నారు. తాను మూడు విడతలుగా ఆయనకు 40 లక్షల రూపాయలు అందజేశానని వివరించారు. అయితే తనకు ఇప్పటివరకు పదవి ఇవ్వకపోగా తాను ఇచ్చిన డబ్బులను కూడా తిరిగి ఇవ్వనంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి న్యాయం చేయాలని వేడుకున్నారు. తన డబ్బులు ఇవ్వకుంటే మంత్రి రోజా ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు.
కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడులో మైనర్ మరియు మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మంగళవారం స్థానిక రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాడు మండలంలోని ఈ గోకవరంలో ఉన్న సుబ్బారెడ్డి సాగర్ ను, కిత్తమురుపేటలో గల చంద్రబాబు సాగర్ ను, ఏలేశ్వరం మండలంలో ఏలేరు రిజర్వాయర్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా సత్యప్రభ మాట్లాడుతూ ప్రాజెక్టు అభివృద్ధి పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేనని ఆమె అన్నారు. సుబ్బారెడ్డి సాగర్ కు పూడికతీత పనులను వెంటనే చేపట్టాలని అన్నారు. అలాగే చంద్రబాబు సాగర్ కు పిల్ల కాలువలను ఏర్పాటు చేయాలని అన్నారు. అలాగే ఎల్లప్పుడూ నిండుకుండలా ఉండే ఏలేరు ప్రాజెక్టుకు మరింత నీరు అందించేందుకు పురుషోత్తమ పట్నం పనులు చేపట్టి గోదావరి జలాలను ఏలేరు రిజర్వాయర్కు గత ప్రభుత్వంలో నీరు అందించడం జరిగిందని అదేవిధంగా ఈ ప్రభుత్వంలో కూడా నీరు అందించాలని ఆమె డిమాండ్ చేశారు. ఏలూరు ప్రాజెక్టు నుండి స్టీల్ ప్లాంట్ కు వెళ్లే నీటిని శంఖవరంలో ఒక కెనాల్ ను, పెద్దిపాలెంలో ఒక కెనాల్ ను ఏర్పాటు చేసి రైతులకు నీరు అందించే విధంగా చూడాలని అన్నారు.
రాయదుర్గం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలను ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. వినాయక సర్కిల్లో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పూల నాగరాజు ఆధ్వర్యంలో కేక్ కోసి సంబరాలు జరుపుకున్నారు. రాయదుర్గం శాంతినగర్ లోని ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తనయుడు కాల్వ భరత్ ఆధ్వర్యంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాయదుర్గం పట్టణంలో ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ కోసి సంబరాలు జరుపుకున్నారు. తన అభిమాన నాయకుడు జన్మదిన వేడుకలను తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతో ఉత్సవంతో జరుపుకున్నారు.






Total views : 91177