తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే టిడిపి ఇంచార్జ్ జి.శంకర్ యాదవ్ తలపెట్టిన జయహో బీసీ కార్యక్రమానికి పోలీసులు ఆంక్షలు విధించారు. అంగళ్లు లో ర్యాలీలకు ఎటువంటి పర్మిషన్ లేదంటూ అంగళ్లు 30 యాక్ట్ 144 సెక్షన్ అమల్లో ఉందని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. అంగళ్లు కూడలి వద్ద పెద్ద ఎత్తున పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా అంగళ్ళలోని మూడు రోడ్ల కూడలి వద్ద టిడిపి శ్రేణులు చేయబోతున్న కేక్ కటింగ్ కు పర్మిషన్ లేదంటూ ఇక్కడ ఎవరైనా కేక్ కటింగ్ వంటి కార్యక్రమాలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మదనపల్లి రూరల్ సీఐ శివాంజనేయులు బెదిరింపులకు గురి చేస్తున్నారు.
లోకేష్ జన్మదిన వేడుకలను అడ్డుకున్న పోలీసులు…
362
previous post





Total views : 180911