వచ్చే సంవత్సరం జరగనున్న సీబీఎస్ఈ 10, 12వ తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. పదోతరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 18 వరకు, 12వ తరగతి వారికి ఫిబ్రవరి 17 నుంచి ఏప్రిల్ 4 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. పూర్తి టైమ్ టేబుల్ను విద్యార్థులు సీబీఎస్ఈ అధికారిక పోర్టల్లో చూడొచ్చు. పదోతరగతి విద్యార్థులకు మొదటి పరీక్ష ఇంగ్లిష్. 12వ తరగతి వారికి మొదటి పరీక్ష ఫిజికల్ ఎడ్యుకేషన్.
ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో కోడ్ను కేటాయించారు. బోర్డు పరీక్షలకు సంబంధించిన గరిష్ఠ మార్కులు, ప్రాక్టికల్స్ సమాచారం, ప్రాజెక్టు వర్క్, అంతర్గత మదింపు, ఆన్సర్ బుక్ లెట్ నమూనా వంటి సమాచారాన్ని సీబీఎస్ఈ పోర్టల్లో అందుబాటులో ఉంచారు. ‘సీబీఎస్ఈఅకడమిక్.ఎన్ఐసీ.ఇన్’ అనే మరో పోర్టల్లోకి వెళ్లి ప్రశ్నల నమూనాలు, మార్కుల కేటాయింపు, పరీక్షా పద్ధతి వంటి వివరాలన్నీ విద్యార్థులు చూడొచ్చని సీబీఎస్ఈ వెల్లడించింది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- సింహాచలంలో వైభవంగా శ్రావణ శుక్రవారం పూజలు.విశాఖపట్నం సింహాచల పుణ్యక్షేత్రంలో శ్రావణమాసం తొలి శుక్రవారం సందర్భంగా ఆధ్యాత్మిక సందడి నెలకొంది. శ్రీ సింహవల్లి తాయారు సన్నిధిలో లక్ష కుంకుమార్చన పూజలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రావణమాసంలో తొలి శుక్రవారం అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజుగా భావిస్తుండటంతో.. ప్రత్యేక పూజలకు భక్తులు…
- బాలానగర్లో గంజాయి ముఠాపై తెలంగాణ ఈగల్ భారీ ఆపరేషన్.హైదరాబాద్ బాలానగర్లో గంజాయి ముఠాను పట్టుకునేందుకు వెళ్లిన తెలంగాణ ఈగల్ పోలీసులకు ఊహించని ప్రతిఘటన ఎదురైంది. నిందితులు పోలీసులపై కుక్కను వదలడంతో పాటు స్క్రూడ్రైవర్తో దాడికి పాల్పడ్డారు. అర్ధరాత్రి ప్రారంభమైన ఈ ఆపరేషన్లో నిందితుడు పక్క భవనాలపైకి దూకుతూ తప్పించుకునే ప్రయత్నం…
- అత్యల్ప ఉత్పాదకతతో ముగిసిన లోక్సభ వర్షాకాల సమావేశాలు.లోక్సభ వర్షాకాల సమావేశాలు ఈసారి అత్యంత తక్కువ ఉత్పాదకతతో ముగిశాయి. నిర్ణయించిన మొత్తం సమయంతో పోలిస్తే లోక్సభలో కేవలం 15 శాతం మాత్రమే కార్యకలాపాలు జరిగాయని PRS లెజిస్లేటివ్ రీసెర్చ్ గణాంకాలు వెల్లడించాయి. గత రెండు దశాబ్దాల్లో అత్యల్ప ఉత్పాదకత నమోదైన…
- మహబూబ్ నగర్ భూత్పూర్ వద్ద రోడ్డు ప్రమాదం.ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడిన ఘటన మహబూబ్ నగర జిల్లాలోని భూత్పూర్ ఠాణా ఎదుట చోటుచేసుకుంది. 44వ జాతీయ రహదారిపై ముందున్న లారీ టైరు పేలిపోవడంతో బస్సును అదుపుచేసే క్రమంలో ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఈ బస్సులో దాదాపు…
- అమరావతిని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయడమే లక్ష్యం.ఏపీ రాజధాని అమరావతి అంటే ఇక గ్రాఫిక్స్ కాదు… గ్రౌండ్లో కనిపిస్తున్న రియాలిటీ. రాజధాని రోడ్లపై రయ్మంటూ దూసుకెళ్లే వాహనాలకు మరో కొత్త మార్గం సిద్ధమైంది. రాజధాని రవాణా వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే ఈ-3 సీడ్ యాక్సెస్ రోడ్డు రెండో దశతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి