పొత్తులు పెట్టుకొని ఎంత మంది వచ్చిన ప్రజలు మాత్రం సీఎం జగన్ కె పట్టం కడతారని వైసీపీ అభ్యర్థి బుట్ట రేణుక (Butta Renuka) అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎన్నికల ప్రచారం చేపట్టిన వైసీపీ అభ్యర్థి బుట్ట రేణుకకు ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు. ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలకు సీఎం జగన్ అందించిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ ఫ్యాన్ గుర్తుకు మరో సారి ఓటు వేయాలని అభ్యర్థిస్తూ బుట్ట రేణుక ప్రచారం నిర్వహించింది. అనంతరం ఆమె మాట్లాడుతూ సీఎం జగనన్న పాలనలో ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందించామని, ఇవాళ ఆ పథకాలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తూ, టీడీపీ, జనసేన, బీజేపీ ఇలా అందరు కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో నిలబడ్డ ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరని బుట్టరేణుక అన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- జనసేన అధినేత పవన్కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం.కోట్ల రూపాయల విలువైన భూములను కాజేసేందుకు భారీ కుట్ర జరిగిందంటూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సోదరుడు రామకృష్ణ తమకు భారీ మొత్తంలో డబ్బులు, అపార్ట్మెంట్లలో ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చి…





Total views : 90731