కొంతమంది కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతుంటారు. రోజూ లీటర్కు పైగా తాగే వాళ్లూ ఉన్నారు. అయితే ఈ అలవాటు ఆరోగ్యానికి చేటనే వైద్య నిపుణులు చెపుతున్నారు. ఈ క్రమంలోనే కూల్ డ్రింక్స్ను ఎక్కువగా తాగడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. కూల్ డ్రింక్స్ను అధికంగా సేవించడం వల్ల వాటిలో ఉండే చక్కెర శరీరానికి అదనపు క్యాలరీలను ఇస్తుంది. దీంతో బరువు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. కూల్ డ్రింక్స్ను తాగడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. అవి కూల్ డ్రింక్స్లో ఉండే పదార్థాలను శరీరం నుంచి బయటకు పంపేయడానికి నీటిని ఎక్కువగా వాడుకుంటాయి. దీంతో డీహైడ్రేషన్ బారిన పడి, నీరసం చెందుతారు. కూల్ డ్రింక్స్లో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది మనం నిత్యం తీసుకునే మోతాదుకు మించరాదు. మోతాదు మించితే గుండె కొట్టుకునే వేగం అసాధారణ రీతిలో ఉంటుంది. బీపీ పెరుగుతుంది. కాల్షియం తగ్గుతుంది. కొన్ని సందర్భాల్లో గుండె సమస్యలు తలెత్తి హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అందుకే కూల్ డ్రింక్స్ను మితి మీరి తాగడం మంచిది కాదు.
Health Care
పనీర్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. కాల్షియం ఎముకలను బలహీనంగా, పెళుసుగా మార్చే బోలు ఎముకల వ్యాధి రిస్క్ను నివారిస్తుంది. పనీర్లో భాస్వరం కూడా ఉంది. ఇది ఎముకల బలోపేతానికి కాల్షియంతో కలిసి పనిచేస్తుంది. పనీర్లో ప్రొటీన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. శాకాహారులు ఇతర సోర్స్ నుంచి ప్రొటీన్ తీసుకోవాల్సి ఉంటుంది. పనీర్ వారికి బెస్ట్ ఆప్షన్గా చెప్పవచ్చు. ఎందుకంటే 100 గ్రాముల పనీర్లో 18 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది మాంసంలో ఉండే ప్రొటీన్తో సమానం. శరీరంలోని కణజాలాలు, ఎంజైములు, హార్మోన్స్, కండరాల నిర్మాణం, మరమ్మత్తులో ప్రోటీన్ పాత్ర కీలకం. ఆరోగ్యకరమైన జీవక్రియను నిర్వహించడంలోనూ ఇది కీలకంగా వ్యవహరిస్తుంది. పనీర్ ఐటెమ్స్ తింటే ఎక్కువ సమయం పొట్ట నిండుగా ఉన్న అనుభూతిని అందిస్తుంది. ఫలితంగా అతిగా తినాలనే కోరిక తగ్గుతుంది. ఈ మిల్క్ ప్రొడక్ట్ నుంచి జింక్ కూడా లభిస్తుంది. ఇది శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. శరీరంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తిలో జింక్ పాత్ర కీలకం. ఇది ఇన్ఫెక్షన్స్, వ్యాధులతో పోరాడుతుంది. బలమైన రోగనిరోధక వ్యవస్థ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అయితే రోజుకు గరిష్టంగా 100-200 గ్రాముల పనీర్ మాత్రమే తీసుకోవాలని, అతిగా తింటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. పొటాషియం కంటెంట్ పనీర్లో తగినంత ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. ఫలితంగా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మోనో అన్శాచురేటెడ్, పాలీ అన్శాచురేటెడ్ ఫ్యాట్స్ ఇందులో ఉంటాయి. ఇవి మంచి కొవ్వులు. శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్, గుండె జబ్బుల రిస్క్ను తగ్గించడంలో వీటి పాత్ర కీలకం. పనీర్లో సోడియం కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది.
Read Also..
Read Also..
అల్సర్ లతో బాధపడేవారికి అరటి పండ్లను తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. డయాబెటిస్ రాకుండా, బీపి కంట్రోల్ లో ఉండేలా చేయగలిగిన శక్తి అరటిపండులో ఉందని చెబుతున్నారు. అధిక ఫైబర్, ప్రోటీన్లు ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల డయాబెటిస్ కు చెక్ పెట్టొచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఇక డయాబెటిస్ బాధితులు కూడా అరటి పండ్లను తినొచ్చు అని అయితే బాగా మిగల పండిన అరటి పండ్లను తినకూడదు అని చెబుతున్నారు. అరటి పండ్లను తినడం వల్ల క్యాన్సర్ రిస్క్ నుండి కూడా కాపాడుకోవచ్చని, చర్మ సంబంధమైన సమస్యల నుండి కూడా బయట పడవచ్చని చెబుతున్నారు. శరీరానికి అరటిపండు నిగారింపును ఇస్తుంది అని, జుట్టు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది అని చెబుతున్నారు.
వయస్సు పైబడిన వారేకాదు యంగ్ ఏజ్లో ఉన్నవారిని సైతం ఇప్పుడు కంటి చూపు సమస్యలు వస్తున్నాయి. ఇలా ఇబ్బందులు పడుతున్నవారుగోజీ బెర్రీలను డైట్లో తీసుకోవడం మంచిది. వీటిని ఎండబెట్టి డబ్బాల్లో స్టోర్ చేస్తారు. రోజుకో పది ఎండు గోజీ బెర్రీలను తింటే కంటి సమస్యలు తగ్గుతాయి. ఎండిన గోజీ బెర్రీలను క్రమం తప్పకుండా తింటే సైట్ రావడం, కళ్ళల్లో మచ్చలు రావడం, ఇతర దృష్టి లోపాలు రాకుండా కాపాడుతాయి. గోజీ బెర్రీలలో ఉండే లుటీన్, జియాక్సంతిన్ హానికరమైన నీలి కాంతిని ఫిల్టర్ చేసిన యాంటీఆక్సిడెంట్ రక్షణను అందిస్తాయి. ఎండుద్రాక్షల్లా కనిపించే వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇక క్యాన్సర్, గుండె సంబంధిత రోగాల నుంచి కూడా గోజీ బెర్రీలు రక్షణ ఇస్తాయని అధ్యయనంలో తెలిపారు.
ఆముదం నూనె కీళ్ల నొప్పులు తగ్గడానికి మంచి ఔషదంలాగా పని చేస్తుంది. కీళ్ల నొప్పులు ఉన్న చోట ఆముదం నూనెతో మర్దన చేయాలి. ఆముదం నూనెలో ముంచిన వస్త్రాన్ని నొప్పి ఉన్న చోట ప్లాస్టిక్ కవర్ తో కట్టాలి ఇలా ఒక గంట సేపు ఉంచాలి, ఆ తరువాత ఆ ప్రదేశంలో వేడినీటితో లేదా వేడి వస్తువుని పెట్టి కొద్దిసేపు మర్దన చేయాలి. సాధారణంగా నులిపురుగు మరియు మలబద్దకం నివారణ కోసం ఆముదం నూనె ఎక్కువగా వాడుతారు. అయితే నాలుగు స్పూన్స్ కొబ్బరి నూనె తీసుకొని 2 స్పూన్స్ ఆముదం నూనె కలిపి మెత్తని వస్త్రాన్ని అందులో ముంచి పొట్ట మీద రాత్రి అంతా అలాగే ఉంచాలి. ఇలా చేయడం వలన ఉదయం వరకు నులి పురుగులు చనిపోతాయి. ఆముదం నూనె చర్మ సౌందర్యానికి అద్బుత ఔషదం అని చెప్పవచ్చు. ఆముదం నూనె ముఖానికి కూడా పెట్టవచ్చు, ఎండ వల్ల కమిలిపోయి నల్లగా అయిన చర్మం మళ్ళీ మామూలుగా అవ్వాలి అంటే ఆముదం నూనె పూతలాగా పూసి ఒక గంట తరువాత కడగాలి. ఆముదం నూనెను చర్మం పైన పూతలాగా పూయాలి ఇలా చేయడం వల్ల చర్మం బిగుతుగా అవ్వడమే కాకుండా ముడతలు కూడా తగ్గుతాయి. ఆముదం చర్మం అడుగున ఉండే కొల్లజెన్ ఉత్పత్తిని పెంచుతుంది.
Read Also..
Read Also..
ఉదయం టిఫిన్ మానేయడం వల్ల లేదంటే కావాలని తినకుండా ఉండటం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. టిఫిన్ మానేయడంవల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఉదయం ఖాళీ కడుపుతో ఉండటం వల్ల ఎన్ని నష్టాలు కలుగుతాయో తెలుసుకుందాం. శరీరం బలహీనంగా అనిపిస్తుంది. శక్తి లేకపోవడం వల్ల మీరు రోజంతా అలసిపోతారు. ఉత్పాదకత పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. టిఫిన్ తీసుకోకపోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయి తగ్గిపోయి శరీరంలో ఒత్తిడి హార్మోన్లు పెరుగుతాయి. శరీరంలో పోషకాల లోపం వల్ల వచ్చే వ్యాధులు వస్తాయి. కోపం పెరుగుతుంది. రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. అధిక మొత్తంలో ఒత్తిడి హార్మోన్ల కారణంగా మానసిక స్థితి క్షీణిస్తుంది. దీనివల్ల చికాకు కలుగుతుంటుంది.
ప్రస్తుతం కాలుష్యం రోజురోజుకు పెరుగుతోంది. దీనివల్ల సహజ సిద్ధంగా లభించే మంచినీటిని కూడా తాగలేకపోతున్నారు. ఇప్పటికే చాలామంది మినరల్ వాట్ అంటూ బాగా శుద్ధి చేసిన నీటిని వాడుతున్నారు. మినరల్ వాటర్ తాగే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మినరల్ వాటర్ పేరుతో అమ్మే ప్రతి బాటిల్ మినరల్ వాటర్ కాదు. ఈ పేరుతో డిస్టిల్డ్ వాటర్ ను అమ్ముతుంటారు. కొనేటప్పుడే చూసుకొని కొనుక్కోవాలి. భూగర్భ వనరుల నుంచి నీటిని తీసుకొని వాటిని శుద్ధి చేసి కావల్సిన మినరల్స్ ను కలుపుతారు. తర్వాత ఈ నీటిని ప్యాక్ చేసి సహజమైన మినరల్ వాటర్ గా అమ్ముతారు. ముఖ్యమైన ఖనిజాలు ఆ నీటిలో సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. డిస్టిల్డ్ వాటర్ అనేది ఎక్కడైనా నీటిని వనరు నుంచి నీటిని తీసుకొని ఆవిరిగా మారేవరకు వేడిచేస్తారు. ఆవిరిని చల్లబరిచి మళ్లీ నేరుగా మారుస్తారు. సూక్ష్మక్రిములు ఉండవు. దీన్ని తాగకూడదు. ఎందుకంటే ఇందులో మినరల్స్ ఉండవు. అవసరమైన ఖనిజాలే ఉంటాయి. దీన్ని తాగడంవల్ల ఆరోగ్యం పాడవుతుంది.
చెరకురసంలోని లవణాలు నోటి దుర్వాసనను వదిలించి దంతాలు పుచ్చిపోకుండా కాపాడతాయి. కామెర్ల వ్యాధి తగ్గించడంలో చెరకు రసం మహత్తరంగా పనిచేస్తుంది. జ్వరాన పడ్డప్పుడు కోల్పోయిన ప్రొటీన్ను చెరకు రసం భర్తీ చేయడంలో తోడ్పడుతుంది. మూత్ర సంబంధ సమస్యలను చెరుకు రసం పరిష్కరిస్తుంది. కేన్సర్తో పోరాడే శక్తినిస్తుంది. ముఖ్యంగా ప్రొస్టేట్, బ్రెస్ట్ కేన్సర్ల చికిత్సకు ఎంతో ఉపకరిస్తుంది. శరీర బరువును తగ్గిస్తుంది. గొంతు నొప్పి, ఫ్లూ, జలుబును తగ్గిస్తుంది. చెరుకు రసంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో ఏర్పడే ఫ్రీ ర్యాడికల్స్ ప్రభావాన్ని తగ్గించడమే కాక, కణాలు నాశనం కాకుండా చూస్తాయి. దీంతోపాటు శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. మధుమేహం ఉన్నవారు కూడా నిరభ్యంతరంగా చెరుకు రసాన్ని తాగవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలపై ప్రభావం చూపే అవకాశాలు తక్కువగా ఉంటాయని వారు చెబుతున్నారు.
చలికాలంలో ఉదయాన్నే చల్లటి నీళ్లు శరీరంపై పడగానే ఒళ్లు బిగుసుకుపోయినట్లుగా అనిపిస్తుంటుంది. చన్నీటి స్నానం యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉన్న నోర్పైన్ఫ్రైన్ను విడుదల చేస్తుందని నిపుణులు అంటున్నారు. చన్నీటి స్నానం చేయడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. చన్నీటిలో స్విమ్మింగ్ చేసేవారికి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. చిన్నీటి స్నానం శరీరా సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ అద్భుత ప్రయోజనాలు పొందడానికి చన్నీటి స్నానం చేయడం మంచిదని నిపుణులు అంటున్నారు. చన్నీటి స్నానం వల్ల శరీరంలోని అన్ని అవయవాలకు ఒక క్రమపద్ధతిలో రక్తప్రసరణ జరుగుతుంది. దీనివల్ల ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా ఉంటాయి. అలాగే ధమనుల్లో కూడా రక్తప్రసరణ బాగా జరిగి గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. చన్నీటి స్నానం వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది. ఈ క్రమంలో శరీరంలోని మలినాలు, విష పదార్థాలను సులభంగా తొలగిస్తుంది. క్రమం తప్పకుండా చల్లటి స్నానం చేసే వ్యక్తుల్లో జీవక్రియ మెరుగ్గా ఉంటుంది. వీరి శరీరంలోని గోధుమ కొవ్వు కణజాలం, మంచి కొవ్వు యాక్టివ్గా ఉంటాయి. దీనితో శరీరంలో వేడి పెరుగుతుంది, చల్లని ఉష్ణోగ్రతల నుంచి రక్షణ లభిస్తుంది. తద్వారా జీవక్రియ మెరుగుపడుతుంది. చన్నీటి స్నానం జీవక్రియను మెరుగుపరచి, శరీరంలో కొవ్వు త్వరగా కరిగేలా సహాయపడుతుంది.
చలికాలంలో తేనె తీసుకోవడంవల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. మన శరీరంలోని వ్యాధులను నయం చేసే ఎన్నో ఔషధాలు తేనెలో ఉన్నాయి. చలికాలంలో ప్రతి రోజూ తేనె తీసుకోవడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం లభించడంతోపాటు మంచి నిద్ర వస్తుంది. తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన ఉంటే ప్రతిరోజూ తేనె తీసుకోవడం మంచిది. కడుపు వ్యాధులను నయం చేయడంలో తేనె ఎంతో ఉపయోగపడుతుంది. 1 గ్లాసు నీటిలో 1 టీస్పూన్ తేనె వేసి రాత్రిపూట తాగాలి. దీంతో అజీర్ణం, మలబద్ధకం, కడుపు వాపు వంటివి నయమవుతాయి. బరువు పెరుగుతున్నామంటూ ఆందోళన చెందుతుంటే తేనె ఎంతో ప్రయోజనకారి. ఊబకాయం తగ్గడానికి, బరువు తగ్గడానికి ప్రతిఒక్కరూ తమ ఆహారంలో తేనెను భాగంగా చేర్చుకోవాలి. రక్తాన్నిపెంచడానికి తేనె ఎంతో మేలు. రక్తహీనతతో బాధపడేవారు శీతాకాలంలో తరుచుగా తేనెను తీసుకోవాలి. ఇది హిమోగ్లోబిన్ను పెంచడంలో సహాయకారిగా మారుతుంది. తేనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు ఎంతో మేలు చేస్తాయి. చలికాలంలో గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవాలంటే రోజూ తేనెను తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. దీని వల్ల చర్మం కూడా నిగారింపును సంతరించుకుంటుంది.
Read Also..
Read Also..





Total views : 141274