విజయవాడ, కేంద్ర ఎన్నికల చీఫ్ రాజీవ్ కుమార్ ని కలిసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చివరి దశలో పెట్టాలని కోరాను. ఎన్నికల రోజే రిజల్ట్ కూడా ప్రకటించాలి. కోవిడ్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుంది కాబట్టి జాగ్రత్తలు అవసరం. కాపులందరూ బయటకు రావాలని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ కి నా పర్సనల్ రిక్వెస్ట్ వంగవీటి రంగాని చంపిన పార్టీతో కలవద్దు. నా ఆరోగ్యం బాగానే ఉంది. నా మీద విష ప్రయోగం చేసినా దేవుని కృపతో వైద్యుల సహాయంతో బయటపడ్డాను. నా మీద విష ప్రయోగానికి సంబంధించి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను.
Janasena
అమరావతి, నేడు కేంద్ర ఎన్నికల సంఘ ప్రతినిధులను కలవనున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్. ఎన్నికలలో వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులను వాడకూడదని ఫిర్యాదు. ఇప్పటికే టీడీపీ, జనసేన సానుభూతిపరుల ఓట్ల తొలగింపు పై ఫిర్యాదు చేసిన ప్రతిపక్షాలు. ఫిర్యాదులు పరిష్కరించినట్టుగా టీడీపీకి లేఖ రాసిన ఈసి. మరి కొన్ని ఫిర్యాదులు పరిష్కరణ దశలో ఉన్నాయని వెల్లడి. ఉమ్మడిగా ఫిర్యాదు చేయనున్న పవన్, చంద్రబాబు. వాలంటీర్లు అసలు ఉద్యోగులే కాదని చెబుతున్న వైసీపీ. సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులని వెల్లడి. ఎన్నికలలో ప్రభుత్వ ఉద్యోగులను వాడకూడదని ఎలా చెబుతారని అంటున్న వైసీపీ. ఉదయం చంద్రబాబు పవన్ భేటీ తర్వాత ఈసీ ని కలిసే అవకాశం. ఈసీకి ఫిర్యాదు చేయాల్సిన అంశాలపై ముందుగా చర్చించునున్న ఇరువురు నేతలు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఈసీ తో సమావేశం.
ఏలూరు జిల్లాలో రాష్ట్ర మోర్చా సంయుక్త సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు. రెండు, మూడు నెలల్లో ఎన్నికలకు వెళ్ళబోతున్నామన్నారు. ఇప్పటికే వికసిత భారత్ కార్యక్రమంతో విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళామన్నారు. బీజేపీ ఏమీ చేయలేదన్న అపవాదు తొలగించేందుకే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. కేంద్రం చేపడుతున్న ప్రతి కార్యక్రమాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్లేందుకు మోర్చాల సంయుక్త సమావేశం జరిగిందన్నారు. ప్రతి వర్గానికి న్యాయం చేస్తున్న పార్టీ బీజేపీ అన్నారు. ప్రస్తుతం తమ పొత్తు జనసేనతో కొనసాగుతోందన్నారు. రాష్ట్రంలో ఇతర పార్టీలతో పొత్తులను అధిష్ఠానం నిర్ణయిస్తుందని పురందేశ్వరి తేల్చి చెప్పారు.
Read Also..
ఏలూరు లో రాష్ట్ర మోర్చా సంయుక్త సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు. రెండు మూడు నెలల్లో ఎన్నికలకు వెళ్ళబోతున్నమని ఇప్పటికే వికసిత భారత్ కార్యక్రమం ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళామని ఆవిడ అన్నారు. భాజపా ఏమీ చేయలేదన్న అపవాదు తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్నమని కేంద్రం చేపడుతున్న ప్రతి కార్యక్రమాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్లేందుకు మోర్చాల సంయుక్త సమావేశం ఏర్పాటు చేశామని అన్నారు. ప్రతి వర్గానికి భాజపా పార్టీ న్యాయం చేస్తుందన్నారు. ప్రస్తుతం మా పొత్తు జనసేనతో కొనసాగుతోందని రాష్ట్రంలో ఇతర పార్టీలతో పొత్తులను అధిష్ఠానం నిర్ణయిస్తుందని అన్నారు.
గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీల చించివేత. పాత గుంటూరు లోని బాలాజీ నగర్, 3,8 డివిజన్ ప్రాంతాల్లో గుర్తుతెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు చించివేసిన వైనం. జనసేన కార్యకర్తలు ఆగ్రహం. పవన్ కల్యాణ్ ఫ్లెక్సీలను ఉద్దేశపూర్వకంగానే చించినట్లు జనసేన నేతల ఆరోపణలు. దర్యాప్తు చేస్తున్న గుంటూరు పోలీసులు.
భీమవరం సభలో సీఎం జగన్ పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యక్తిగత ఆరోపణలను జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి మురళీకృష్ణ (చిన్న) తీవ్రంగా ఖండించారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలోని ఆయన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భంగా వంద సంవత్సరాలు చరిత్ర కలిగిన చెట్లను నరికివేశారని, పవన్ కళ్యాణ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటే మీకెందుకు అని పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల కోసం మీకెందుకు అని ప్రశ్నించారు. అనేక మంది ప్రధాన మంత్రులు ఆ ప్రాంగణంలో సభలు నిర్వహించారని జగన్ సభకు మాత్రం చెట్లు నరికేశారని అన్నారు. విలువల కోసం విశ్వనియత కోసం మాట్లాడే అర్హత జగన్ కు లేదని జగన్ జైల్ లో ఉన్న సమయంలో పార్టీ కోసం కష్టపడిన తల్లిని, చెల్లిని ప్రక్కన బెట్టారని మండిపడ్డారు.
చంద్రబాబు కుప్పం పర్యటనలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. బాబును కలిసిన జనసేన నాయకులు తమ పార్టీ కండువా కప్పారు. గతంలో చంద్రబాబు ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నా ఇప్పటివరకు టీడీపీ కండువా లేకుండా ఇతర పార్టీ కండువాలు కప్పుకున్న దాఖలాలు లేవు. కానీ తొలిసారి జనసేన కండువా కప్పుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. కుప్పంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని జనసేన ముఖ్య నాయకులతో సమావేశమైన సందర్భంలో తిరుపతికి చెందిన బత్తిన మధుబాబు., చంద్రబాబు మెడలో జనసేన కండువా వేసారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు జై జనసేన జై పవన్ కళ్యాణ్, జై తెలుగుదేశం జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు.
అన్నమయ్య జిల్లా, సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి గ్రామాలలో నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్ కు రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ రెండు గ్రామాల క్రికెట్ జట్లు కెప్టెన్లకు ఒక్కొక్కరికి రూ 10 వేలు చొప్పున రూ 20 వేలు క్రికెట్ కిట్టు కొనుగోలు కోసం చెక్కు అందజేశారు. యువత శక్తివంతంగా ఎదగాలి, యువతతోనే దేశంలో మార్పు సాధ్యం అని ఆయన వెల్లడించారు. యువత క్రీడారంగం, రాజకీయ రంగమే కాక అన్ని రంగాలలోనూ రాణించి శక్తివంతంగా ఎదిగి దేశ అభ్యున్నతి కోసం పాటుపడాలని అన్నారు. వీరబల్లి మండలానికి చెందిన ఈడిగ పల్లె, వడ్డిపల్లె గ్రామాల యువకుల కోరిక మేరకు క్రికెట్ కిట్టు కొనుగోలు కోసం చెక్కు అందజేశారు.
అనంతరం జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడలు, చదువు పట్ల మక్కువ పెంచుకొని, ప్రతి దినము వ్యాయామం చేస్తూ శరీరాన్ని ఆరోగ్యంగా, సౌష్టవంగా ఉంచుకోవాలని సూచించారు. యువత మంచిగా ఉంటే దేశం బాగుపడుతుందని ఆయన తెలిపారు.
ఎన్నికల వేళ నేతలు వెదజల్లే డబ్బులు కోసం ఆశ పడకుండా, మీ భవిష్యత్తు బాగుండాలి అంటే వచ్చిన నాయకులను, అధికారులను రోడ్లు, పారిశుద్ధ్యం, మంచినీటి వసతి వంటి అభివృద్ధి పనుల కోసం అధికారులను, నేతలను నిలదీయాలని అన్నారు. గ్రామ గ్రామాన ఇందుకోసం యువత నడుం బిగించాలని, అప్పుడే దేశం సమగ్రాభివృద్ధి చెందుతుందని తెలిపారు. రానున్న ఎన్నికలలో టిడిపి, జనసేన కూటమిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జనసేన చేనేత వికాస రాష్ట్ర కార్యదర్శి రాటాల రామయ్య, శ్రీనివాసులు, చౌడయ్య, కొత్తూరు వీరయ్య ఆచారి,కత్తి సుబ్బరాయుడు, పోలిశెట్టి రజిత, శిరీష, వీరబల్లి మండలం వడ్డీ పల్లె క్రికెట్ జట్టు కెప్టెన్ బాలచంద్ర, ఈడిగపల్లె జట్టు కెప్టెన్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
విశాఖకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వంశీకృష్ణ యాదవ్ కు జనసేనాని కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. జనసేన పార్టీలోకి రావడంతో పార్టీ మారినట్టుగా అనిపించడంలేదు. సొంత ఇంటికి వచ్చినట్టుగా అనిపిస్తోందని వంశీకృష్ణ వ్యాఖ్యానించారు. తాను ఏ పార్టీలో ఉన్నప్పటికీ పవన్ కల్యాణ్ అభిమానిగానే ఉన్నానని వెల్లడించారు. ఉత్తరాంధ్రలో, విశాఖలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు, పవన్ కల్యాణ్ ను సీఎంగా చేసేందుకు సర్వశక్తులు ధారపోస్తాను అని తెలిపారు. వంశీకృష్ణ యాదవ్ జనసేనలోకి రావడం పట్ల పవన్ కల్యాణ్ స్పందించారు. వంశీకృష్ణ యాదవ్ చాలా బలమైన నాయకుడు అని కొనియాడారు. స్వల్ప తేడాతో విశాఖ తూర్పు నుంచి ఓడిపోయి, మళ్లీ ఎమ్మెల్సీగా గెలిచారని వివరించారు. ఇప్పుడాయనకు సొంత కుటుంబంలోకి స్వాగతం పలుకుతున్నాను అంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ రూరల్ నియోజకవర్గం అత్యంత ధనిక ప్రాంతంగా పేరు ఉంది. పారిశ్రామిక వాడలు, ఓడరేవులు, ఖరీదైన భూములు ఇక్కడే ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం ఇక్కడే జరుగుతుంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ఆయన అనుచరులు కబ్జాలకు పాల్పడుతున్నారని జనసేన సీనియర్ నేత ఆరోపిస్తున్నారు. కాకినాడ రూరల్ నియోజవర్గంలో ఖరీదైన భూములతో పాటు లేఔట్లకు సంబంధించి సామాజిక స్థలాలు కూడా ఎమ్మెల్యే సోదరుడు, పిఏ, బంధువులు వారి పేరు మీద రాయించుకున్నారని భావనారాయణ స్వామి ఆలయ మాజీ చైర్మన్, జనసేన రూరల్ నియోజవర్గ ప్రతినిధి పుల్లా శ్రీరాములు (దేవస్థానం శ్రీను) ఆరోపిచారు. సమాచార హక్కు చట్టం కింద తాను తీసుకున్న వివరాలు ప్రకారమే ఈ ఆరోపణలు చేస్తున్నాను అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే రూరల్ పై ఆరోపణలు చేశారని తాను సేకరించిన కబ్జాల సమాచారాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు వెళ్తున్నట్లు శ్రీరాములు తెలిపారు. అదేవిధంగా న్యాయపోరాటం కూడా చేస్తున్నట్లు తెలిపారు. దమ్ము, ధైర్యం ఉంటే ఎమ్మెల్యే, ఆయన అనుచరులు బహిరంగ చర్చికి సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు.





Total views : 90727