మిచాంగ్ తుఫాన్ ఉమ్మడి కృష్ణా జిల్లాలను అతలాకుతలం చేస్తుంది. గంట గంటకు పెరుగుతున్న భారీ వర్షాలకు ఈదురుగాలులు తోడవడంతో అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని కలగజేస్తోంది. మరి కొద్ది సేపట్లో తీరం దాటే క్రమంలో మచిలీపట్నం మంగినపూడి బీచ్ లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రం వైపు పర్యాటకలను అనుమతించకుండా పోలీసులు, మెరైన్ మరియు అగ్నిమాపక సిబ్బంది ప్రత్యేక గస్తీ కాస్తున్నారు.
krishna district news
మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో కోడూరు మండలం సముద్రతీర ప్రాంత గ్రామాలైన, పాలకాయతిప్ప, ఉంటగుణం, రామకృష్ణాపురం. బసవన్నవానిపాలెం, పిండి వాని దెబ్బ , పలు గ్రామాలలోని ప్రజలను సోమవారం సాయంత్రం సురక్షిత ప్రాంతానికి తరలించి, అధికారులు ఏర్పాటు చేసిన కోడూరు స్వసంత్రపురం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలోని పునరాలస కేంద్రాలను అదికారులు ఏర్పాటు చేశారు. ఈరోజు అవనిగడ్డ నియోజకవర్గం శాసనసభ్యులు సింహాద్రి పునరావాస కేంద్రాని పరిశీలించారు. కేంద్రాల్లోని ఉంటున్న ప్రతి ఒక్కరిని ఆప్యాయతగా పలకరిస్తూ తుఫాన్ ప్రభావం తగ్గేవరకు పునరాస కేంద్రాల్లోనే ఉండాలని సూచించారు. అవసరమైన ఏర్పాట్లు అధికారులు, ప్రజాప్రతినిధులు సమగ్రంగా నిర్వహిస్తారని తెలిపారు. ఈ తుఫాన్ ప్రభావంతో వల్ల ఎవరు ఆ ధైర్యం పడవద్దని, ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని ఆయన తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి ఎప్పుడుకప్పుడు అధికారి యంత్రంగానికి సూచనలిస్తూ అవసరమైన సదుపాయాలను సమకూర్చటం జరిగిదని అన్నారు
రోడ్లపై రాసులుగా పోసివున్న ధాన్యాన్ని చూసి చలించిపోయిన వర్ల కుమార్ రాజా ప్రభుత్వ అనాలొచిత నిర్ణయాల వల్లే రైతులు నష్టపోతున్నారన్నారు. రైతులు వారం రోజుగా సంచులు, రవాణా సౌకర్యాలు కల్పించాలని కోరుతున్న ప్రభుత్వం స్పందించలేదని ఆయన అన్నారు. లారీలకు జిపిఎస్ ట్రాకింగ్ విధానాన్ని రద్దుచేసి… వారం రోజుల క్రితం ఆఫ్లైన్లో ధాన్యం కొనుగోలు చేస్తే రైతులకు నేడు ఈ దుస్థితి వచ్చేది కాదని ఆయన అన్నారు. సకాలంలో గోన్ సంచులు సరఫరా చేయకపోవడం, లారీలను పెంచకపోవడంతోనే రైతులు ఇబ్బందుల పాలవుతున్నారని అన్నారు. ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రైతులు లాభ పడింది లేదని విమర్శించారు. 50 ఏళ్ల చరిత్రలో రైతులకు ఇలాంటి దయనీయమైన దీనావస్థ ఎప్పుడు లేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ దుస్థితి సంభవించింది తడిసిన ధాన్యాన్ని, రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
మచిలీపట్నంలో వైసీపీ, టీడీపీ నేతల మాటలతో బందరు రాజకీయం రసవత్తరంగా మారింది.మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఏమ్మెల్యే పేర్ని నానిపై తీవ్రస్తాయిలో విమర్శలు చేసారు. బందరు ని గాలికి వదిలేసి సొంత ప్రయోజనాల కోసం ,కమిషన్ల కోసం, గాలి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. పోర్టు నిర్మాణం పై ఎంత పని జరిగిందో స్వేతపత్రం విడుదల చేస్తారా అనీ డిమాండ్ చేసారు.ఇసుకని యదేచ్చగా అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. ప్రజలు తనను గెలిపిస్తే కొడుకుకి అధికారం ఇచ్చి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
విజయవాడ సెంట్రల్ అజిత్ సింగ్ నగర్ లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని డీజీపీ రాజేంద్ర నాధ్ రెడ్డి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి,వైసీపీ నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ…విజయవాడ నగర అభివృద్ధి విస్తరించడంతో పెరుగుతున్న ట్రాఫిక్ ను నియంత్రించడానికి ఈ నూతన పోలీస్ స్టేషన్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. నగర శివారు ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం అనీ తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్ట్ కలకలం రేపింది. ఇసుక దోపిడీకి నిరసనగా ఇబ్రహీంపట్నం ఫెర్రీ లో.. ఇసుక కుప్పపై కూర్చొని దేవినేని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు అరెస్ట్ చేసి.. విజయవాడ వన్ టౌన్ పీఎస్ కు తరలించారు. ఇసుక దోపిడీని ఆపకుండా అరెస్టు చేయడం ఏంటంటూ పోలీసులపై దేవినేని ఉమా మండిపడ్డారు. దోపిడీ చేస్తున్న వారిని అరెస్టు చేయమని అడిగితే.. ప్రశ్నిస్తున్న తమ నోరు నొక్కాలని చూస్తున్నారన్నారు.
ఆయనొక ఏఈఓ … విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వద్ద విధులు నిర్వహిస్తూ.. ఆలయానికి వచ్చిన భక్తుల పట్ల మర్యాదగా నడుచుకోవాలి.
కానీ ఆయన మాత్రం నోరు విప్పితే చాలు పచ్చి బూతులే.. గతంలోనూ పలుమార్లు బూతులు తిడుతూ మీడియాలో వెలుగులోకి వచ్చారు. ఆలయ సన్నిధి వద్ద విధులు నిర్వహించే అర్చకులను సైతం బూతులు తిడుతూ, ఒక ధర్మ కర్తను బూతులు తిడుతూ మాట్లాడిన తీరు పై.. పాలక మండలి సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఇప్పటికే సదరు ఏఈఓపై భక్తులు మండిపడుతున్నారు. ఇలాంటి వారి పై తక్షణమే చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు.
చేతికొచ్చిన వరి పంట దక్కించుకోవడానికి రైతులు నానా కష్టాలు పడ్డారు. ఆకాశం ఒక్కసారిగా మేగావృతమై చిరుజల్లులు పడటంతో పండించిన పంట చేతికి రాదేమోనని రైతు గుండెల్లో గుబులు మొదలైంది. కృష్ణ జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరు, నాగాయలంక, అవనిగడ్డ మండలంలో బిపిటీ సన్న విత్తనాలతో రైతులు వరి సాగుచేశారు. చేతికొచ్చే పంటను కాపాడుకోవడానికి యంత్రాల సహాయంతో కోసి ధాన్యాన్ని ఒడ్డుకు చేర్చుకున్నారు. ఒక్క ఎకరాకు 40 నుంచి 45బస్తాలు, హెక్టార్లుకు 100 నుంచి 115బస్తాల దిగుబడి వస్తుందని రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 76 కేజీల ధాన్యం ధర 17వందల రూపాయలు… క్వింటాలు ధాన్యం ధర 2వేల 300 చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు రైతులు తేలియజేస్తున్నారు. ఈ నియోజకవర్గంలోని చల్లపల్లి , మోపిదేవి, ఘంటసాల మండలాలలో రైతాంగం పలు రకాల వరి వంగడాలపై ఆసక్తి చూపారు. అయితే రైతులు ఆశించిన విధంగానే ఎకరాకు 38 నుంచి 44 బస్తాల దిగుబడి వస్తుంది. క్వింటల్ ధాన్యం ధర 2వేల 200 రూపాయలకు కోనుగోలు చేస్తున్నారు. మంచి దిగుబడి రావడంతో.. రైతులు పడిన కష్టానికి తగిన ఫలితం లభించింది.
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం గన్నవరం మండలం కొత్తగూడెంలో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. వల్లభనేని అరుణ చారిటబుల్ ట్రస్టు ద్వారా 5లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఆర్వో ప్లాంట్ ను వంశీ ప్రారంభించారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడుతూ ఏ రాజకీయ నాయకుడైన ప్రజలకు మంచి చేసేందుకు పని చేయాలి. అధికారంలో ఉండగా చేయలేని పనులు వేరే వారిని చూసి అంతకు మించి చేస్తానంటే ప్రజలు నమ్మరు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్ మెంట్ ద్వారా లక్షల మంది పేద కుటుంబాలలో వెలుగులు రాజశేఖర్ రెడ్డి నింపారు. అదే బాటలో సీఎం జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ ద్వారా పేదల ఆత్మగౌరవాన్ని పెంచాడు. వృద్ధులు, వికలాంగులు ఏనాయకుడు వద్ద పడిగాపులు పడకుండా 1వ తేదీన ఇంటివద్దనే ఫెంక్షన్ అందిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి నాలుగున్నర ఏళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీని అమలు చేస్తున్నాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చిన ఒక్క సంక్షేమ పధకం కూడా ఆపలేదు. పేదలకు సంక్షేమ పథకాలు అమలులో కొన్ని అప్పులు చేయడం సహజం. గత ప్రభుత్వాలు అప్పులు చేయకుండా జేబులో డబ్బులు ఖర్చు చేశారా????? పేదలకు మంచి చేస్తుంటే కొంతమంది పప్పు బెల్లాలు లాగా పెడుతున్నారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పెత్తందారీ విధానాన్ని మార్చడం షావుకారులకు కడుపు మంటగా ఉంది. కొన్ని పత్రికలు, టీవీ చానల్స్ ద్వారా రాష్ట్రాన్ని అప్పులుపాలు చేస్తున్నారని అసత్య ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో పేద ప్రజలకు ఎక్కడా కష్టం రాలేదు. కష్టం వచ్చింది కేవలం చంద్రబాబుకి మాత్రమే. ధనికులు పిల్లలు కార్పొరేట్ పాఠశాలల్లో చదివితే ఇంగ్లీష్ అర్ధం అవుతుంది. పేదల పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివితే అర్ధం కాదని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబుని నమ్మి రైతు, డ్వాక్రా రుణమాఫీ చేస్తామని గ్రామాల్లో చెప్పి చేయలేని పరిస్థితి. రాష్ట్రానికి సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఉంటే పేద ప్రజలకు మంచి జరుగుతుంది.
ఎన్టీఆర్ జిల్లా మొత్తాన్ని కరువు జిల్లాగా ప్రకటించారు. ఎకరానికి ఆహార పంటకు 50,000 ఉద్యానవన పంటలకు 75000 వాణిజ్య పంటకు లక్ష రూపాయలు చొప్పున నష్టపరిహారం అందించాలి. పంట బీమా వాతావరణ బీమా పథకాలను అమలు చేసి పూర్తిగా నష్టపరిహారం ఇప్పించాలి. ఖరీఫ్ లో బ్యాంకుల నుంచి తీసుకున్న అన్ని రకాల పంట రుణాలను మాఫీ చేయాలి. వాస్తవ సాగుదారులైన కౌలు రైతుల గురించి పంట నష్టపరిహారం కౌలు రైతులకు ఇవ్వాలి. వేదాద్రి చింతలపూడి లాంటి చిన్న మధ్య తరహా ఎత్తిపోతల పథకాన్ని అన్ని అన్నింటికీ నిధులు కేటాయించి పూర్తి చేయాలి. నిల్వమున్న పంటలను కాపాడుకోవడానికి పగటిపాడు తొమ్మిది గంటలు కరెంట్ ఇవ్వాలి. రబిలో పంటలు వేయడానికి వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. వ్యవసాయ పనులు లేని గ్రామాల్లో ఉపాధి పనులు ప్రారంభించి రోజుకు 600 చొప్పున సంవత్సరానికి 1200 రోజులు పని కనిపించాలి. రబి పంటలకు అవసరమైన విత్తనాలను ఎరువులను పురుగుమందులను ప్రభుత్వం అందించాలి.