నంద్యాల జిల్లా డోన్ లో 03.04.2024 మధ్యాహ్నం డోన్ టౌన్ శ్రీ రామ నగరం నాయకల్లు భరత్ చంద్ర, బోయ ఉదయ్ ఇద్దరు పత్తికొండ ఏరియాలో ఒక వ్యక్తి వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసి డోనులో అమ్ముకోడం కొరకు ఇద్దరు పంచుకుంటుండగా పోలీసులకు సమాచారం రావడంతో 1100 గ్రాములు గంజాయి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలియజేయడమేమనగా ఎక్కువ శాతం యువతనే గంజాయి తీసుకుంటున్నారు. కాబట్టి వారి తల్లిదండ్రులు వారి పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలని డోన్ సీఐ తెలిపారు. వీరి దగ్గర నుంచి ఎవరు అమ్ముతున్నారు. అన్నా విషయంపై విచారణ చేస్తామని పోలీసులు తెలిపారు.
Marijuana
బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ధనార్జేనే ధ్యేయంగా చేస్తున్న వృత్తిని మరిచి దొంగలను పట్టుకొని శిక్షించాల్సిన పోలీసులే గంజాయి సప్లై చేస్తు బాలనగర్ ఎస్ఓటి పోలీసులకు చిక్కిన ఘటన స్థానికంగా కలకలం రేగింది. కాకినాడకి చెందిన ఎపిఎస్పి 3వ బెటాలియన్ కు చెందిన పట్నాయక్(35), శ్రీనివాస్(34) ఇద్దరు పోలీసులు..ఆరోగ్యం బాగలేదని సిక్ లీవ్ పెట్టి నర్సిపట్నం నుండి బాచుపల్లి పారిశ్రామిక వాడలో పనిచేస్తున్న కార్మికులకు గంజాయి అమ్మడమే ప్రవృత్తిగా ఎంచుకుని ఎప్పటిలాగే Ap39Qh1769 ఈకో కార్ లో సప్లై చేస్తున్న ఏపి పోలీసులను అర్ధరాత్రి వలపన్ని పట్టుకున్నారు బాలనగర్ ఎస్ఓటి పోలీసులు..వారినుండి 22కేజిల గంజాయి 11ఫ్యాకెట్స్ తో పాటు 2మొబైల్స్,మారుతీ సుజుకీ ఈకో కార్ తో పాటు డబ్బులు సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. వీరిపై నార్కొటిక్ డ్రగ్స్ సైకో ట్రోఫిక్ సబ్ స్టంసెస్ యాక్ట్ క్రింద కేసునమోదు చేసినట్టు బాచుపల్లి పోలీసులు తెలిపారు.
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం పరిధిలోని రుద్రారం గ్రామంలో నిన్న అర్ధరాత్రి చోటు చేసుకున్న ఘటనలో స్థానికంగా నివసించే హజ్జు అనే యువకుని పై అదే గ్రామానికి చెందిన బాలరాజు గంజాయి మత్తులో దాడి చేసి తీవ్రంగా కొట్టడంతో తీవ్రంగా గాయాలు కాగా అతని కుటుంబ సభ్యులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనలు అనునిత్యం రుద్రారం గ్రామంలో జరుగుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. దీనిపై స్థానిక నేతలు, పోలీస్ వ్యవస్థ చర్యలు చేపట్టకపోవడంతో గ్రామంలో గంజాయి సేవించే యువకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
Read Also..
సీలేరు లో భారీ గంజాయి పట్టివేత, అల్లూరి జిల్లా జీకె వీధి సీలేరు పోలీసులు వాహనాలు చెకింగ్ లో కోటి 50 లక్షలు విలువ చేసే 725 కేజీలు భారీ గంజాయి పట్టివేత. ఇద్దరు అరెస్టు ముగ్గురు పరారు. అశోక లేలాండ్ గూడ్స్ లారీ మరియు ఒక కారు రెండు సెల్ ఫోన్లు 1300 రూపాయలు నగదు సీజ్. ముద్దాయిలను కోర్టుకు తరలింపు. పరారైన నిందితులను ప్రత్యేక బృందం ద్వారా పట్టుకొని మీడియా ముందు ప్రవేశపెడతాం చింతపల్లి పోలీస్ డివిజన్ అడిషనల్ ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. అల్లూరు జిల్లా ఎస్పీ తుహాన్ సీనవా చింతపల్లి సబ్ డివిజనల్ అడిషనల్ ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్, ఆదేశాల మేరకు వాహనాలు తనిఖీలు భాగంగా గంజాయి ముఠాను పట్టుకున్న పోలీసు,సీలేరు టిఆర్సి క్యాంప్ సమీపంలో వాహనాలు పరిశీలిస్తుండగా అటుగా వస్తున్న లారీ కారును పరిశీలించగా 725 కేజీలు గంజాయి లారీ లో ఉన్నా నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా, మహారాష్ట్రానికి చెందిన వాళ్ళని, ఒడిస్సారాష్ట్రం చిత్రకొండలో గంజాయిని కొనుగోలు చేశారని వివరించారు, గంజాయి ముఠాను అదుపులోకి తీసుకొని లారీ,కారు,2సెల్ ఫోన్లు,1300 నగదును సీజ్ చేసి, నిందితులను రిమాండ్కు తరలిస్తామని గంజాయి విలువ కోటి 50 లక్షలు ఉంటుందని తెలిపారు, ఈ కేసును చేదించిన సిఐ అశోక్ కుమార్ ను, సీలేరు ఎస్సై రామకృష్ణను, పోలీస్ సిబ్బందిని అభినందించారు.
అల్లూరి జిల్లా.. వాహనాలు తనీఖీ లో భాగంగా అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడు కిలోల 227 గ్రాముల లిక్విడ్ గంజాయిని, 23 లక్షల 50 వేల రూపాయలు నగదును, ఓలంగి రాజారావు అనే వ్యక్తిని పట్టుకొవడం జరిగింది. ఇతను జి మాడుగుల మండలం అలగాం గ్రామంనకు చెందినవాడు. ఓలంగి రాజారావు చాలా రోజుల నుంచి ఈ లిక్విడ్ గంజాయి వ్యాపారానికి అలవాటు పడ్డాడు. రెండు మూడు సంవత్సరాల క్రితం తమిళనాడు నుండి కొంతమంది వచ్చి లిక్విడ్ గంజాయి తయారు చేయడం నెర్పారు. అక్కడ నుండి లిక్వడ్ తయారుచేసే మిషన్ తీసుకురావడం జరిగింది. చుట్టుపక్కల ఒరిస్సా ప్రాంతాము నుండి గంజాయి సేకరించి లిక్విడ్ గంజాయి తయారు చేయడం నేర్చుకున్నాడు. ఇతను దగ్గర నుండి లిక్విడ్ గంజాయి, 23లక్షల 50 వేలు నగదు, వెయింగి మిషన్, లిక్విడ్ తయారుచేసే మిషను, పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నాము.
Read Also..
కుత్బుల్లాపూర్.. శామీర్ పెట్ పోలీస్ స్టేషన్ పరిధి లో భారీ గంజాయి తరలిస్తున్న ఆరుగురు సభ్యులముఠా ను మేడ్చల్ ఎస్ ఓ టి పోలీసులు అరెస్ట్ చేశారు. ఒరిస్సా నుండి పుణె వయా హైదరాబాద్ మీదుగా రెండు (కార్లు)వాహనాల్లో తరలిస్తున్న 272 కేజీల గంజాయి ని శామీర్ పెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ ఔటర్ రింగ్ రోడ్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 2 కార్లు, 7 సెల్ ఫోన్లు, స్వాధీన పరచుకుని రిమాండ్ కు తరలించామని, పెట్ బషీరాబాద్ లోని డీసీపీ కార్యాలయంలో మేడ్చల్ జోన్ డీసీపీ శబరీష్ వివరాలు వెల్లడించారు. పట్టుకున్న సొత్తు విలువ సుమారు 80 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ మండలం ఈసుగాం సమీపంలో పోలీసులు మరియు టాస్క్ ఫోర్స్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా సుమారు యాబై వేలు విలువ చేసే 1.4 కిలోల గంజాయి పట్టుపడినట్టు పోలీసులు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన రెండు ద్విచెక్ర్ వాహనాలను తనిఖీ చెయ్యగా వారి వద్దనున్న బ్యాగుల్లో గంజాయి పట్టుపడినట్లు తెలిపారు. మహారాష్ట్ర నుంచి కోనుగోలు చేసి ఇక్కడ విక్రయించేందుకు తీసుకు వచ్చినట్టు యువకులు తెలిపారని అన్నారు. ఈ మేరకు రెండు ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి ముగ్గురి పై కేసు నమోదు చేసినట్టు ఈసుగాం పోలీసులు తెలిపారు. కాగా పట్టుపడిన యువకులు ముగ్గురు కూడా మైనర్ లే అని పోలీసులు పేర్కొన్నారు.
పెద్దపల్లి జిల్లా రామగుండంలో గంజాయి అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. గోదావరిఖని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోదావరి బ్రిడ్జ్ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ అధికారులు, అనుమానస్పదంగా బైక్ లపై వస్తున్న ఐదుగురు వ్యక్తులను తనిఖీ చేయగా వారి వద్ద ఉన్న బ్యాగ్ లలో 4.60 కేజీల గంజాయిని గుర్తించారు. దీని విలువ సుమారు 80,200 ఉంటుందని పొలీసులు తెలిపారు. నిందితులు కొన్ని రోజులుగా గంజాయికి బానిసై , తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదగించాలనే దురుదేశ్యంతో, ఆసిఫాబాద్ జిల్లా తీర్యాణి నుండి గుర్తు తెలియని వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేసి గోదావరిఖని ప్రాంతంలోని అమాయకపు విద్యార్థులకు, యువతకి ఎక్కువ ధరకు అమ్ముతన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వారి వద్ద లభించిన గంజాయి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Read Also..
Read Also..




Total views : 150042