శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం అసెంబ్లీ టిడిపి అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నామినేషన్ దాఖలు చేసారు. సూగూరు స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బాలకృష్ణ, సతీమణి వసుంధర దేవి తో కలిసి తాసిల్దార్ కార్యాలయంకు చేరుకొని రెండు సెట్ల నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి అందజేశారు. అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ అవకాశం కల్పిస్తే మరింత అభివృద్ధి చేస్తామన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
హిందూపురం మండలం తూమకుంట లో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేసి వేలాదిమంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత స్వర్గీయ
ఎన్టీఆర్ స్ఫూర్తితో హిందూపురంలో మరింత అభివృద్ధి చేస్తామన్నారు బాలకృష్ణ. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు సిసి రోడ్లు వేసామన్నారు. హిందూపురం ప్రజలు నన్ను రెండుసార్లు ఆశీర్వదించారు మూడోసారి ఆశీర్వదించాలని బాలకృష్ణ ప్రజలను కోరారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్సిగ్నల్.మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. 2021లో పంచాయతీ ఎన్నికల సమయంలో నమోదైన కేసులో ప్రాసిక్యూషన్కు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. 2021 ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో…
- హిమాచల్ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియ విరిగిపడటంతో ధల్లి… సంజౌలి బైపాస్ను పూర్తిగా మూసివేశారు. దీంతో ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొండచరియ విరిగిపడటంతో భారీగా శిథిలాలు రహదారిపైకి వచ్చిపడ్డాయి. శిథిలాలు అడ్డంకి ఉండటంతో వాహనాల రాకపోకలకు…
- అమెరికా: న్యూయార్క్లో కాల్పుల కలకలం.అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద కాల్పులు కలకం సృష్టించాయి. కాల్పులకు తెగబడటమే కాకుండా ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. నిత్యం రద్దీగా ఉండే మాన్హాటన్ పర్యాటక ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల శబ్దం వినిపించడంతో పర్యాటకులు, స్థానికులు…






Total views : 149956