Somireddy
వైసీపీ అక్రమాలపై టిడిపి నాయకులు తిరుపతి కలెక్టర్ ను కలిశారు. భూకబ్జాలు, అక్రమ మైన్స్, దొంగ ఓట్ల వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి టిడిపి నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీసుకెళ్లారు. వైసిపి ఎమ్మెల్యేలు, మంత్రులకు ప్రభుత్వ అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఫిర్యాదు చేశారు. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వైసీపీ నేతలు దోచుకుంటున్నారని మండిపడ్డారు. వైసిపి నేతల అక్రమాలపై ఆందోళనలు చేస్తున్న టిడిపి నేతలపై అక్రమ కేసులను పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తిరుపతి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వేల దొంగ ఓటర్లను సృష్టించడమే కాకుండా చనిపోయిన వారి ఓట్లను తీసివేయకుండా కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. కలెక్టర్ 15 రోజుల్లో స్పందించకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించి వైసిపి నేతలు అక్రమంగా సంపాదించిన ప్రతి రూపాయిని ప్రజలు ముందు పెడతామని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.
Read Also..
Read Also..
వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి, ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరిల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఇరువురు మధ్య మాటల తుటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు పరస్పరం విమర్శల చేసుకోవడంతో ఏపీలో బీజేపీ వర్సెస్ వైసీపీగా రాజకీయం నడుస్తోంది. ఈ క్రమంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి విజయసాయిరెడ్డిపై ఫైర్ అయ్యారు. పురందేశ్వరిని విమర్శించే అర్హత విజయసాయిరెడ్డికి లేదని అన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి ఒక నొటోరియస్ క్రిమినల్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రమంత్రిగా పురందేశ్వరి 9 ఏళ్లుగా పని చేయడంతో ఆమె ప్రజలకు తెలుసు విజయిసాయిరెడ్డి మాత్రం ఏ2గానే ప్రజలకు తెలుసని ఎద్దేవా చేశారు. అసలు విజయసాయిరెడ్డికి సంస్కారం లేదని ధ్వజమెత్తారు. పురందేశ్వరి బయటపెట్టిన వైసీసీ ప్రభుత్వ అవినీతిపై విజయసాయిరెడ్డి సమాధానం చెప్పాలని సోమిరెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.