సింగరేణి ఎన్నికలు కొనసాగుతున్నాయి. సింగరేణిలో మొదటిసారిగా 1998 సంవత్సరంలో కార్మిక సంఘం ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆరుసార్లు ఎన్నికలు జరగగా అందులో ఏఐటీయూసీ మూడు సార్లు, ఐఎన్టీయూసీ ఒకసారి, టీబీజీకేఎస్ రెండు సార్లు గెలిచి అధికార హోదాను అనుభవించాయి. ఏడో దఫా జరిగే 2023 ఎన్నికల్లో 14 సంఘాలు పోటీ చేయాల్సి ఉన్నా 13 సంఘాలు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశాయి. ఏడో దఫా ఎన్నికలు, ఇందు కోసం సింగరేణి అధికార యంత్రాంగం, కార్మిక శాఖ సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. తెలంగాణ లోని 6 జిల్లాల పరిధిలో ఉన్న 11 డివిజన్ లలో, 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా,12 ఓట్ల లెక్కింపు కేంద్రాలను,440 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించెందుకు సింగరేణి యాజమాన్యం పూర్తిగా ఏర్పాట్లు చేసింది. సింగరేణి విస్తరించి ఉన్న 11 ఏరియాలలో సింగరేణి సంస్థలో 50,500 కార్మికులు ఉన్నా 39,748 మంది కార్మిక ఓటర్లు తమ ఓటును వినియోగించుకోనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు లలోని 16 పోలింగ్ కేంద్రాలలో 5387 మంది సింగరేణి కార్మిక ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలో నాలుగు ఏరియాల్లో మొత్తం 16 పోలింగ్ కేంద్రాలను ఏరియా కి ఒకటి చొప్పున నాలుగు లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఖమ్మం జిల్లాలోని జేవీఆర్, కిష్టారం ఓసీలలో మొత్తం మూడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుండగా భద్రాద్రి కొత్తగూడెం ఏరియాలో 13 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. కొత్తగూడెం ఏరియాలో 6,ఇల్లెందు ఏరియాలో 3, మణుగూరు ఏరియాలో 7 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాత్రి ఏడు గంటల నుంచి లెక్కింపు ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపుకు 200 మంది సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. సింగరేణి ఎన్నికలను బ్యాలెట్ పద్దతిన నిర్వహించేందుకు కార్మిక శాఖ సంసిద్దమవుతోంది. అయితే ఎన్నికల నిర్వహణ, ఫలితాల వెల్లడి ఒకే రోజు కావడంతో ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసింది.
TBGKS
రేపు జరగనున్న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర కార్మిక సంఘం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్లలో 39 వేల 748 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల కోసం 84 పోలింగ్ కేంద్రాలను, 7 వందల మంది సిబ్బందిని కేటాయించారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత శ్రీరాంపూర్, రామగుండం, భూపాలపల్లి, కొత్తగూడెం లలో కౌంటింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలో జరగనున్న ఎన్నికలలో 13 కార్మిక సంఘాలు బరిలో నిలిచాయి. 1998 నుండి సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తుండగా, తొలిసారి AITUC విజయం సాధించింది. ఇప్పటివరకు ఆరుసార్లు ఎన్నికలు నిర్వహించగా మూడుసార్లు AITUC, రెండుసార్లు TBGKS, ఒకసారి INTUC విజయం సాధించాయి.
Read Also..
Read Also..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మరికాసేపట్లో సింగరేణి ఎన్నికల ప్రచారం ముగియనున్నది. గుర్తింపు సంఘం కోసం జరిగే ఎన్నికల్లో కార్మిక సంఘాల నేతలు పోటాపోటిగా ప్రచారం చేసారు. ప్రచారంలో కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, మరియు బిఆరెఎస్ & కమ్యూనిస్ట్ నేతలు పాల్గొన్నారు. ఈరోజు 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనున్నది. 27న ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగియనున్నది. అనంతరం కౌంటింగ్ జరుగుతుంది. అధికారులు ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సింగరేణి అధికారులు, కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 6 జిల్లాలు, 12 నియోజకవర్గాలు, 13 ఏరియాలలో మొత్తం 39991 మంది కార్మిక ఓటర్లు ఉన్నారు అలాగే 14 గుర్తింపు కార్మిక సంఘాలున్నాయి. భూపాలపల్లిలో మొత్తం మైన్స్ పై 9 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసారు. 5350 మంది ఓటును నమోదు చేసుకున్నారు. ప్రధానంగా ఈ ఎన్నికల పోటీలో INTUC, AITUC, TBGKS, CITU, HMS, BMS కార్మిక సంఘాలున్నాయి.
సింగరేణిలో ఏడో విడత ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఈ నెల 27న సింగరేణి వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించనున్నారు. సింగరేణిలో అన్ని పార్టీలు తమ సత్తా చాటేందుకు తీవ్రంగా శ్రమించాయి. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. సింగరేణిలో ప్రస్తుతం సుమారు 40 వేల మంది కార్మికులు పాల్గొననున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం ఐఎన్టియుసి కూడా విజయ కేతనం ఎగుర వేసేందుకు ఊవ్విళ్లూరుతోంది. బిఆర్ఎస్ అనుబంధ సంస్థ టిబిజికెఎస్, సిపిఐ అనుబంధ కార్మిక సంఘం ఎఐటియుసి, కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టియుసి యూనియన్ల మధ్యే ప్రధాన పోటీ కొన సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిఐటియు, బిఎంఎస్, హెచ్ఎంఎస్ జాతీయ సంఘాలు కూడా పోటీలో ఉండి ఉనికి కోసం ఉబలాటపడుతున్నాయి.
కార్మికుల హక్కులు, ప్రయోజనాల సాధనకు సంస్థను నిద్రపోనివ్వ బోమని సింగరేణి అంటే సింహగర్జన అని, అదే స్ఫూర్తితో పని చేస్తూ సంస్థను కాపాడుకోవాల్సిన అవసరముందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సింగరేణి సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీబీజీకేఎస్ సంఘ నాయకులు, కార్యకర్తలతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ సింగరేణి సంస్థ పురోగమనానికి టీబీజీకేఎస్ గెలుపు చాలా అవసరమన్నారు. సింగరేణి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో బొగ్గు గని కార్మికులు ముఖ్య పాత్రను పోషించారని ప్రశంసించారు. సింగరేణి కార్మికులకు ఉన్న పోరాట స్ఫూర్తి జాతీయ సంఘాలకు లేదన్నారు. బొగ్గు గనుల్లో కార్మికుల కష్టం తెలంగాణలో వెలుగులు నిండేందుకు కారణమవుతుందన్నారు.





Total views : 149928