ప్రముఖ వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ పెట్టిన కేసుపై సిఐడి విచారణ. గుంటూరు సీఐడీ కార్యాలయంలో విచారణ చేపట్టనున్న అధికారులు. రామ్ గోపాల్ వర్మ పెట్టిన (క్రైమ్ నంబర్ 22/2023) కేసులో A6 గా ఉన్న రాష్ట్ర తెలుగుయువత ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్ కు 17వ తేదీన అర్ధరాత్రి సమయంలో గుంటూరులో సిఐడి పోలీసులు నోటీసులు జారీ చేసారు. A5 గా ఉన్న తిరువూరుకు చెందిన బండి శివకేశవ తో పాటు షేక్ ఫిరోజ్ ను ఈ నెల 19న ఉదయం గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి హాజరు కావాలని నోటిసులలో పేర్కొన్నారు. హాజరు కానీ పక్షములో అదుపులోకి తీసుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.
technology news
ఇవాళ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లో పవన్ తో మర్యాదపూర్వకంగా కలవనున్న బాలశౌరి. సాయంత్రం 5.30 నుంచి 6 గంటల ప్రాంతంలో సంబరాలు చేయనున్న పార్టీ శ్రేణులు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గారు ఇవాళ ఉదయం 11 గంటలకు కలవనున్నారు. ఈ సందర్బంగా ఈరోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల ప్రాంతంలో కృష్ణా, గుంటూరు జిల్లాలోని అన్ని మండలాల్లో బాణసంచా కాల్చి సంబరాలు చేయనున్న జనసేన నాయకులు, కార్యకర్తలు, బాలశౌరి గారి అభిమానులు, అనుచరులు. గుంటూరు పట్టణంలోని లాడ్జి సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద సాయంత్రం 6 గంటలకు దాదాపు 20 డివిజన్లకు చెందిన నాయకులు కలిసి పెద్దఎత్తున ఎంపీ బాలశౌరి గారికి మద్దతుగా బాణసంచా కాల్చనున్నారు.
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం వెంకట కృష్ణాపురంలో జరిగిన భూ వివాదంలో ఐదుగురు రైతులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని మొదట ద్వారకా తిరుమల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రధమ చికిత్స అనంతరం ఏలూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ద్వారకాతిరుమల మండలం గుండుగోలనుగుంట గ్రామానికి చెందిన రైతులకు వెంకట కృష్ణాపురం గ్రామానికి చెందిన రైతులకు గత కొంతకాలంగా భూ వివాదం నడుస్తుంది. ఈ క్రమంలో వెంకట కృష్ణాపురానికి చెందిన వీర వెంకయ్య, శ్రీనివాస్ మరికొందరు గుండుగోలను గుంట గ్రామానికి చెందిన నాగేశ్వరరావు, సత్యనారాయణ, బాలు, వెంకన్న అనే రైతులపై వివాదాస్పద భూమిలో విచక్షణారహితంగా కర్రలతో దాడి చేశారు. ఆ దాడిలో బాధిత రైతులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే హుటాహుటిన ద్వారకాతిరుమల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రధమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం ఏలూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
విజయవాడ, ఆవిష్కరణకు సిద్ధమైన భారీ అంబేద్కర్ విగ్రహం. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ గా నామకరణ. స్వరాజ్య మైదానం లో 20 ఎకరాల్లో భారీ స్మృతివనం. ఎల్లుండి జగన్ చేతుల మీదగా ప్రారంభం. విగ్రహ ఎత్తు 125 అడుగులు , బేస్ పిల్లర్( బేస్ బిల్డింగ్ ) ఎత్తు 80 అడుగులతో కలిపి 205 అడుగుల అతి భారీ విగ్రహంగా రికార్డుకెక్కనున్న అంబేద్కర్ స్టాట్యూ. 2020 జులై 9 న విగ్రహ ఏర్పాటుకు శంకుస్దాపన. డిల్లి నుండి వచ్చిన డిజైనర్లతో సాంకేతిక పరిజ్ఞానంతో వేగంగా రూపుదిద్దుకున్న అంబేద్కర్ విగ్రహం. విగ్రహం క్రింద భాగంలో మూడు ఫ్లోర్లు ఏర్పాటు. ఒక్కో ఫ్లోర్ లో ఒక్కో భారీ హాల్స్ ఏర్పాటు. గ్రౌండ్ ఫ్లోర్ లో నాలుగు హాళ్లు నిర్మాణం. డిజిటల్ లైబ్రరీ, స్క్రీన్ హాల్ , మ్యూజియం ఏర్పాటు. స్కై లైటింగ్, ఫౌంటెన్ , గార్డెన్ తో ప్రత్యేక ఆకర్షణగా విగ్రహం. 404 కోట్ల భారీ వ్యయంతో నిర్మాణం. ఎల్లుండి సాయంత్రం 4 గంటలకు సీయం జగన్ చేతుల మీదగా విగ్రహావిష్కరణ. అనంతరం స్టేడియంలో భారీ బహిరంగ సభ. ఇప్పటికే విగ్రహావిష్కరణకు, సభకు భారిగా ఏర్పాట్లు చేసిన అధికారులు. లక్షన్నర మంది వీక్షించేలా ఏర్పాట్లు.
తెలుగుదేశం పార్టీ రా కదలిరా కార్యక్రమంలో భాగంగా నేడు వెంకటగిరి పట్టణానికి రానున్న టిడిపి అధినేత చంద్రబాబు. ఈ ఉదయం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా విజయవాడ నుంచి వెంకటగిరి కి రానున్న బాబు. చంద్రబాబు బహిరంగ సభకు సర్వం సిద్ధం చేసిన ఆ పార్టీ శ్రేణులు. తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి భారీగా తరలిరానున్న, టిడిపి, జనసేన పార్టీ శ్రేణులు.
పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం పట్టణంలోని బాగు జయరామ్ అనే వ్యక్తి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ వారి ఆక్షన్ లో ఎర్ర గోపు వెంకట సుశీల ఆస్తిని ఆగస్టు నెలలో ఆక్షన్ లో కొనగా బ్యాంకు వారు నవంబర్లో రిజిస్ట్రేషన్ చేశారు. రెండు నెలలుగా ఖాళీ చేయకపోవడంతో గురువారం ఉదయం పోలీసు వారు బ్యాంకు వారు సహకారంతో జయరామ్ స్వాధీనం చేసుకున్నారు. ఈ తరుణంలో సాయంత్రం ప్రహరీ గోడను ప్రోక్లైనర్ తో తొలగిస్తుండగా సుశీల భర్త బకెట్లతో పెట్రోల్ తీసుకొచ్చి జెసిబి పైన, వచ్చిన వారిపైన వెదజల్లగా భయానికి లోనై జయరాం అతని మిత్రులు పారిపోగా జెసిబి డ్రైవర్ పై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. దీంతో జెసిబి డ్రైవర్ కేకలు పెడుతూ రోడ్డు మీద పరుగులు పెడుతుండగా గమనించి మంటలు ఆర్పి హాస్పిటల్ కి తరలించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది అని బంధువులు తెలిపారు. సుశీల భర్తను వన్ టౌన్ పోలీసులు అదుపులో తీసుకొని స్టేషన్ కి తరలించారు.
కృష్ణా జిల్లా, గుడివాడ చంద్రబాబు పై ఫైర్ అయిన మాజీ మంత్రి కొడాలి నాని. కోడాలి నాని మాట్లాడుతూ.. నేడు గుడివాడలో టిడిపి వర్ధంతి చేసి, చంద్రబాబు పిండం పెట్టాడు. తనపై, సీఎం జగన్ పై పిచ్చి ఆరోపణలు చేసి, సొల్లు నాయుడు వెళ్ళాడు. సీఎం లుగా వైఎస్ఆర్, జగన్ హయాంలో ఇళ్ల స్థలాలు,నీటి అవసరాలకు 6వందల ఎకరాల భూసేకరణ చేశారు. 14ఏళ్లు సీఎం గా ఉన్న చంద్రబాబు పేదల కోసం ఒక్క ఎకరా సేకరించినట్లు నిరూపిస్తే రాజకీయాలను వదిలేస్తా. ఎన్నికల్లో పోటీ చేయను, మగాడివైతే నా సవాల్ స్వీకరించాలని ఛాలెంజ్ చేసిన కొడాలి నాని. చావటానికైన సిద్ధంగా ఉన్నా. చంద్రబాబు ఉడత ఊపుడికి భయపడను. గుడివాడలో చంద్రబాబు పిచ్చి కబుర్లు ఎవ్వరూ నమ్మరు. నేను గుడివాడ ముద్దు బిడ్డను. నాలుగు సార్లు గెలిచిన చరిత్ర నాది, మరో నాలుగేళ్లు గెలుస్తా. చంద్రబాబు పార్టీని ఎన్ని సార్లు గెలిపించారు. తెలంగాణ లో బూ స్థాపితం చేశాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్నాడు. 5వేల కుర్చీలు వేసి పది నియోజకవర్గాల నుండి మనుషులని రప్పించి చంద్రబాబు ఏం సాధించారు. లోకేష్ కు అడ్డు వస్తాడనే జూ ఎన్టీఆర్ పైకి, బాలయ్యను వదిలాడు. లోకేష్ లాంటి కొడుకు శత్రువుకు కూడా ఉండకూడదు. వైఎస్సార్ కొన్న స్థలంలో, టిడ్కో ఫ్లాట్ల పునాదులు వేసి చంద్రబాబు వదిలేసాడు. కనీసం కాంట్రాక్టర్ కు డబ్బు కూడా చెల్లించలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్లాట్ల నిర్మాణం పూర్తి చేసి. పూర్తి స్థాయి అభివృద్ధి చేసిన లబ్ది దారులకు అప్పగించిన ఘనత సీఎం జగన్ ది. 75ఏళ్లు వచ్చి కూడా చంద్రబాబు పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు. ఎన్టీఆర్ గంజాయి మొక్క అని చెప్పి, సీఎం పదవి దోచుకున్న రోజులను ఎవ్వరూ మర్చిపోరు. కాంగ్రెస్ దగ్గర ఓనమాలు నేర్చుకున్న చంద్రబాబు మా గురించి మాట్లాడటం హాస్యాస్పదం. మరదలిని చంపి, తమ్ముడిని పిచ్చొడిని చేసిన దుర్మార్గుడు చంద్రబాబుకు తన గురించి మాట్లాడే అర్హత లేదు. తనకు బూతుల కోటలో ఎమ్మెల్యే పదవి వస్తే, కోతల కోటాలో చంద్రబాబుకు వచ్చిందా అని ప్రశ్నించారు.
అయోధ్య శ్రీరామచంద్రుడి పాదాల చెంత సిరిసిల్ల నుండి బంగారు చీరను ఉంచనున్నారు. సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ తన చేతులతో స్వయంగా తయారు చేసిన బంగారు చీరెను ఈనెల 26న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అందించనున్నారు. ప్రధాని చేతుల మీదుగా రాముడి పాదాల చెంత చీరెను ఉంచనున్నారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈరోజు సాయంత్రం సిరిసిల్లలోని హరిప్రసాద్ నివాసానికి వెళ్లారు. హరి ప్రసాద్ స్వయాన తయారు చేసిన బంగారు చీరెను పరిశీలించారు. శ్రీరాముడి చిత్రంతో పాటు రామాయణ ఇతివ్రుత్తాన్ని తెలియజేసే చిత్రాలను సైతం ఆ చీరెలో పొందుపర్చడం విశేషం. 8 గ్రాాముల బంగారం, 20 గ్రాముల వెండితో తయారు చేసిన చీర అందరినీ అబ్బురపరిచేలా ఉంది. అద్బుతంగా చీరెను తయారు చేసిన హరిప్రసాద్ ను ఈ సందర్భంగా బండి సంజయ్ అభినందించారు. శాలువాతో సత్కరించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ స్వయాన తన చేతులతో తయారు చేసిన బంగారు చీరె చాలా బాగుందన్నారు. ఈనెల 26న ప్రధానికి చీరెను అందించనున్నారని, ప్రధాని చేతుల మీదుగా శ్రీరాముడి పాదాల చెంతను ఉంచేందుకు సిద్ధమవడం సంతోషంగా ఉందన్నారు. గతంలో అగ్గిపెట్టెలా చీరెను ఉంచిన చరిత్ర సిరిసిల్ల జిల్లాదన్నారు. ఇంతిటి గొప్ప నైపుణ్యాన్ని సొంతం చేసుకున్న చేనేత రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చేనేత కార్మికులను ఆదుకునేందుకు తనవంతు కృషి చేస్తానని హమీ ఇచ్చారు.
నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో 26 మంది ఉద్యోగులకు దేవస్థానం స్థానచలనం కలిగించింది ఇందులో శాశ్వత ఉద్యోగులు, ఒప్పంద ఉద్యోగులు, పొరుగుసేవ ఉద్యోగులు మొత్తంగా 26 మంది ఉద్యోగులను స్థానికంగా బదిలీ చేశారు. శ్రీశైల దేవస్థానం పరిపాలన సౌలభ్యం కోసం ఉద్యోగులను అంతర్గత బదిలీలు చేసినట్లు ఆలయ ఈవో పెద్దిరాజు ఉత్తర్వులలో తెలిపారు. అయితే ఏఈవో స్థాయి నుండి ఒప్పంద ఉద్యోగి వరకు ఈవో పెద్దిరాజు బదిలీలు చేయడం విశేషం అలానే బదిలీ అయిన ఉత్తర్వుల ప్రకారం 24 గంటల్లో ప్రస్తుతం వారు నిర్వహిస్తున్న విధుల నుండి వారికి నూతనంగా కేటాయించిన విధులకు హాజరు కావాలని ఆలయ ఈవో పెద్దిరాజు ఉత్తర్వులలో తెలిపారు. ఈ మేరకు పలువురు ఉద్యోగులు వారి వారికి కేటాయించిన విధులలో రిపోర్ట్ కూడా సిద్దామయ్యారు.
మన నాడీ వ్యవస్థ ఎంత రిలాక్స్గా, ప్రశాంతంగా ఉంటే అంత మంచిది. ఒత్తిడి తగ్గించేందుకు రోజూవారీ జీవితంలో కొన్ని అలవాట్లు చేసుకోవాలి. ఒత్తిడి నుంచి బయటపడేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
- ప్రతిరోజూ కొంత సమయం పాటు లోతైన శ్వాసను ప్రాక్టీస్ చేయడం వల్ల ట్రిగ్గర్లను తగ్గించి, నాడీ వ్యవస్థకు విశ్రాంతిని పొందవచ్చు. యోగా, వ్యాయామం చేయడం వలన ఒత్తిడి నుంచి ఈజీగా బయటపడొచ్చు.
- విటమిన్ సి అధికంగా ఉండే ఆహారం అడ్రినల్ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. శరీరానికి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ గా పని చేస్తుంది.
- ప్రోటీన్, ఫైబర్, మంచి కొవ్వులు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళనను ఎదుర్కోవచ్చు. సరైన ఆహారం తింటే శారీరకంగా, మానసికంగానూ శక్తిని పెంచుతుంది.
- సానుకూల ఆలోచనా దృక్పథాన్ని అలవాటు చేసుకోవడం వంటి ప్రాథమిక అలవాట్ల ద్వారా ఒత్తిడికి దూరంగా ఉండవచ్చు. ఇవన్నీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి.





Total views : 141819