రంగారెడ్డి జిల్లా మొయినబాద్ మండలం సూరంగల్ గ్రామ రెవెన్యూ లో నిర్మాణంలో ఫస్ట్ మాస్టర్స్ టేబుల్ టెన్నిస్ అకాడమి సంస్థకి చెందిన కన్స్ట్రక్షన్ స్లాబ్ క్రింద చిక్కుకున్నారు. 14 మంది కూలీలు పని చేస్తుండగా 10 మందికి గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. శిదిలాల కింద్ర ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం చనిపోయిన వారు 1)బబ్లు.. బీహార్ వాసి 2)సునీల్.. వెస్ట్ బెంగాల్ డిఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నాయి. డిఆర్ఏఫ్ బృందాల సహాయంతో ఈ మృతదేహాలను వెలికి తీయడం జరిగింది.
Rangareddy
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కిరణ్ ను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తాడని పరిగి పట్టణంలో విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి వీరేందర్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు పరిగి ప్రజలు గతంలో ఎమ్మెల్యేగా గెలిపించారని అభివృద్ధిలో ఇంకా వెనుకబడి ఉందని, అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి మారుతి కిరణ్ కు అవకాశం ఇవ్వాలని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలంటే బిజెపి పార్టీతోనే సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిగి బిజెపి అభ్యర్థి మారుతి కిరణ్, నాయకులు ఆంజనేయులు, శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ లో చేరిన బిఆర్ఎస్ మాజీ అసెంబ్లీ ఇన్చార్జి గౌని శివకుమార్ గారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి వర్యులు జహీరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఏ చంద్రశేఖర్ గారు. పోత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ కి మద్దతు తెలిపిన తెలంగాణ జనసమితి జహీరాబాద్ ఇన్చార్జి మొగుడంపల్లి అశప్ప గారు. కాంగ్రెస్ లో చేరిన మాజీ కౌన్సిలర్ బెజుగం సతీష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ బిఆర్ఎస్ అరచక పాలనను సహించలేక ఇవాళా కాంగ్రెస్ పార్టీలో చెరుతున్నం అని అన్నారు. ప్రజాసమస్యలపై అనేక ఉద్యమాలను చేశాం కాని ఎ ఒక్క ప్రజ సమస్య బిఆర్ఎస్ పరిష్కారించలెదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విచ్చలవిడిగా భూములను గుంజుకోవాడనికి సిద్ధం అవుతున్నాయి అని అన్నారు. జహీరాబాద్ సుగర్ ఫ్యాక్టరీ రైతులకు గత 4,5 నెలలు గా డబ్బులు ఇవ్వకుండా మొండి చెయ్యి చూపిస్తుందన్నారు. మళ్లీ బిఆర్ఎస్ వస్తె చెరుకు రైతుల గొంతు కోసి ఫ్యాక్టరీని మూసి వేసి స్క్రాప్ లో అమ్మేస్తారు అని అన్నారు. సుగర్ ఫ్యాక్టరీ రైతులకు డబ్బులు చెల్లించకుండా హరీష్ రావు కుట్ర చేస్తున్నారని అన్నారు. రైతులకు సరైన న్యాయం జరిగే వరకూ పోరాడుతాను. జహీరాబాద్ లో సిద్దిపేట పెత్తనం సాగుతుంది అని అన్నారు. ఉద్యమకారులకు బిఆర్ఎస్ లో విలువ లేదని కాంగ్రెస్ పార్టీ తో కలిసి రావాలని పిలుపునిచ్చారు. బిఆర్ఎస్ లో ఇప్పుడు ఉన్నవారు అప్పటి తెలంగాణ ద్రొహులె.. బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి తెలంగాణ ఉద్యమ సమయంలో ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్నించారు.
Read Also…
Read Also…
మేడ్చల్ నియోజకవర్గం లో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న మంత్రి మల్లారెడ్డి , ఘట్కేసర్ మండల పరిధి పోచారంలో నిర్వహించిన రోడ్ షో కు భారీగా తరలివచ్చిన జనం. అభివృద్దికే జనం పట్టంకడతారని , కేసిఆర్ వైపు జనం ఉన్నారని , పదేళ్ల కాలంలో అభివృద్ది వైపు అడుగులు వేస్తూ, ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి ధ్యేయంగా కేసిఆర్ నిరంతరం కృషి చేస్తున్నాడని మంత్రి మల్లారెడ్డి గుర్తు చేశారు. అత్తలేని పత్తాలేని కాంగ్రెస్, బిజెపి, పార్టీలు..కాంగ్రెస్ అంటే స్కాంలు తప్ప, స్కీము లేవంటూ మంత్రి మల్లారెడ్డి, ఇసుక పడ్డాడు..కాంగ్రెస్ పార్టీకే గ్యారంటీ లేదని, మరి కాంగ్రెస్ చెప్పే గ్యారంటీలు ఉంటాయా అని ఎద్దేవా చేశారు..
మూడవసారి BRS జెండా ఎగురవేసి , ప్రజల అభివృధి లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు
ఘట్కేసర్ మండలం మాజీ ఎంపీపీ యాట కుమార్ కుటుంబానికి దర్గా దయాకర్ రెడ్డి ఆర్థిక సాయం అందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రభుత్వ హయాంలో యాట కుమార్ ఘట్కేసర్ మండల పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గతంలో టీడీపీ సీనియర్ నాయకుడైన తోటకూర జంగయ్య యాదవ్ తో కలిసి పార్టీ కార్యక్రమానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో యాట కుమార్ మృతి చెందాడు. ఆ తర్వాత అనారోగ్యం కారణంగా కుమార్ భార్య(రేణుక) కూడా మృతి చెందింది. యాట కుమార్ కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. తల్లిదండ్రులను ఇద్దర్నీ కోల్పోయిన పిల్లల బాధ్యత ఇప్పటివరకు బంధువులు చూసుకుంటున్నారు.
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని సీతారాంపూర్ గ్రామానికి చెందిన మంగలి ఆకాష్ (14) లక్ష్మరావు గూడా గ్రామ సమీపంలో ఉన్న క్వారీలో గత బుధవారం 15/11/2023 రోజు దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది.. వివరాల్లోకి వెల్తే: మంగలి ఆకాష్ అనే విద్యార్థి షాబాద్ లోని నవజీవన్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు బుధవారం 15/11/2023 పాఠశాలకు వెళ్లకుండా ఇంటి దగ్గర ఉండి ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన ఒక మహిళ స్కూటీ తీసుకొని వెళ్ళిపోయాడు ఆ స్కూటీ ఆచూకీ లక్ష్మారావు గుడా గ్రామ సమీపంలో ఉన్న క్వారీ దగ్గర కనిపించింది అక్కడ స్కూటీ తో పాటు విద్యార్థి చెప్పులు కూడా ఉన్నాయి అయితే క్వారీలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు గ్రామ సర్పంచ్ సహాయంతో డి ఆర్ ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు ఈ డి ఆర్ ఎఫ్ బృందాలు రెండు రోజులు శ్రమించిన ఫలితం లేకపోయింది ఆ యొక్క క్వారీ లోతు దాదాపు 200 అడుగులు ఉండడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పిలిపించారు ఈరోజు ఉదయం ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి మృతదేహాన్ని వెలికి తీశాయి. తన తల్లిదండ్రులు అనుమానానికి కారణం తన ఇన్స్ట గ్రామ్ లో పెట్టిన స్టేటస్ అని తెలుస్తున్నది. మృతదేహాన్ని పంచనామ నిమిత్తం చేవెళ్లలోని ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు..
Read Also…
Read Also…
దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని మరోసారి ఎన్నుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి కోరారు. కేసీఆర్ది సంక్షేమమని, ప్రతిపక్షాలది సంక్షోభమని మంత్రి పేర్కొన్నారు. శుక్రవారం నాడు కందుకూరు మండలంలోని మాదాపూర్, కోలన్ గూడ, గుమ్మడివెల్లి, ఆకుల మైలారం, మీర్ ఖాన్ పేట్, అన్నోజిగూడ, గూడూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు చాలా కీలకమైనవని, ప్రజలు బాగా ఆలోచించి నిర్ణ యం తీసుకోవాలని కోరారు. ఎన్నో పథకాలను అమలు చేస్తున్న కారు పార్టీ ఇటువైపు ఉంటే.. ఎన్నికలు సమీపించగానే ప్రజల ముందుకు వచ్చి మొసలి కన్నీరు కార్చే కాంగ్రెస్, బి జె పి మరో వైపు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను దేశంలోని ఇతర రాష్ట్రాలు అనుసరిస్తుంటే, కేవలం మూడు నుంచి నాలుగు గంటలు వ్యవసాయ కరెంటు ఇస్తున్న కర్ణాటక మోడల్ ను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పడం దివాళాకోరుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. సాధ్యం కాని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మరో వైపు సందర్భం దొరికిన ప్రతీ సారి తెలంగాణపై విషం చిమ్ముతున్న మోదీ వైఖరిని కూడా అర్థం చేసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ర్టానికి గుండు సున్నా ఇచ్చిన మోదీ దేవుడని బి జె పి నాయకులు అంటున్నారని మండిపడ్డారు. ఇప్పటివరకు తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం చేసింది కేసీఆరేనని, ఇకముందు చేయబోయేది కూడా కేసీఆరేనని పేర్కొంటూ మళ్లీ బి అర్ ఎస్ పార్టీని గెలిపించి కేసీఅర్ ను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పారు.
Read Also….
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం లోని షాబాద్ మండలంలోని అంతారం, కాక్కులుర్, కేసారం, సర్దార్ నగర్ మరియు కుర్వగుడా గ్రామలలో బిఆర్ఎస్ అభ్యర్థి కాలే యాదయ్య ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతి గ్రామం తిరుగుతూ ప్రజలతో మమేకమై తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా ఆయన కోరారు.
ఈ ఎన్నికల్లో అయనకు ఉన్నా ప్రత్యర్థులను విమర్శిస్తూ వారి పై ఉన్న కేసుల గురుంచి చెప్తు వారికీ ఓటు వేస్తే అభివృధి అనేది కుంటు పడుతుందని ఈ సంద్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జడ్పిటిసి పట్నం అవినాశ్ రెడ్డి, మండల అధ్యక్షుడు గూడూరు నర్సింగరావు టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..
Read Also..
చేవెళ్ళ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం హోరుగా కొనసాగుతుందని చెప్పవచ్చు ఈ రోజు షాబాద్ మండలంలోని సోలిపేట, మద్దూరు, హైతబాద్, నాగర్ గూడ, తిర్మాలపుర్, దోస్వాడ మరియు తాళ్లపల్లి గ్రామాలలో బీజేపి అభ్యర్ధి రత్నం ప్రచారానికి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రత్నం మాట్లాడుతూ చేవెళ్ల నియోజకవర్గం లో ఎమ్మెల్యే ఒక దొంగని అన్ని పదవులను తన కుటుంబం వారే అనుభవిస్తున్నారని ఆ కుటుంబ పాలన అంతమెందించడమే బిజెపి లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు అలాగే కాంగ్రెస్ అభ్యర్థి అయిన భీం భారత్ నేర చరిత్ర కలిగిన వ్యక్తి అని క్రిమినల్ కేసులు గల వ్యక్తి అని వారికి మీరు ఓటు వేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలన్నీ మేమే అందిస్తున్నామని చెప్పుకుంటూ మోసపూరితమైన మాటలు చెప్తున్నారని వాటిని ప్రజలు ఎవరు నమ్మవద్దని బిజెపికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఆయన కోరారు. షాబాద్ ను డెవలప్ చేశామని అంటున్న టిఆర్ఎస్ ప్రభుత్వం చందనవెల్లి రైతులకు ఇప్పటివరకు నష్టపరిహారం ఎందుకు ఇయ్యలేదని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు ముందు చందన వెళ్లి రైతులకు పూర్తి నష్టపరిహారం చెల్లించవలసింది ఆయన కోరారు మళ్లీ టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఉన్న భూములు కూడా గుంజుకుంతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Read Also..






Total views : 195651