తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత సీఎస్ కే. రామకృష్ణారావు పదవీ కాలం 2026 జూన్ 30తో ముగియనుండటంతో, కొత్త సీఎస్ నియామకానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేంద్ర సర్వీసుల్లో ఉన్న సంజయ్ జాజును తిరిగి మాతృ కేడర్కు పంపేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల శాఖ ఆయనను వెంటనే పేరెంట్ కేడర్కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా సేవలందిస్తున్నారు సంజయ్ జాజు. సంజయ్ 1992 బ్యాచ్కు చెందిన తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా, విశాఖపట్నం కమిషనర్గా సుదీర్ఘ పరిపాలనా అనుభవం కలిగి ఉన్నారు. ఆయన 2029 ఫిబ్రవరిలో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సంజయ్ జాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిపాలనాపరమైన అంశాలు, తాజా పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. రేసులో జయేశ్ రంజన్, వికాస్ రాజ్ వంటి ఇతర సీనియర్ల పేర్లు ఉన్నప్పటికీ, ప్రభుత్వం సంజయ్ జాజు వైపే మొగ్గు చూపింది
తెలంగాణ కొత్త సీఎస్ గా సంజయ్ జాజు.
201
previous post