24
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురంలో గోద్రెజ్ నిర్మించిన నూతన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు.పామాయిల్ ధర పెంపునకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రైతుల ఆదాయం పెంచే దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఖమ్మం జిల్లా వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, ఇక్కడ అన్ని రకాల పంటలు సాగు చేస్తున్న రైతులకు ఆయిల్ పామ్ మంచి ప్రత్యామ్నాయంగా మారిందన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా ఆయిల్ పామ్ సాగులో అధిక దిగుబడులు సాధించిన విషయాన్ని గుర్తు చేశారు.



Total views : 221433