హైదరాబాద్లో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజేంద్రనగర్ ఎస్వోటీ బృందంతో కలిసి నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. దర్యాప్తులో ప్రధాన నిందితుడు మహమ్మద్ ఫైజాన్ బక్షి నాగ్పూర్ నుంచి గంజాయిని తెప్పించి, సబ్ప్యాడలర్ సయ్యద్ సాదిక్ ద్వారా చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి నగరంలోని పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నిందితుల వద్ద నుంచి 8.410 కిలోల ఎండు గంజాయి, మోటార్సైకిల్, డిజిటల్ తూకం మిషన్లు, సీలింగ్ మిషన్, ప్యాకింగ్ మెటీరియల్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అంతర్రాష్ట్ర గంజాయి సరఫరా నెట్వర్క్పై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.
అత్తాపూర్లో గంజాయి ముఠాపై పోలీసుల ప్రత్యేక దాడులు.
39
previous post



Total views : 221436