వినాయక చవితి పండుగ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. వినాయక చవితి పండుగ సందర్భంగా దేశ, విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. తొలి పూజ అందుకునే ఆ గణనాథుడు దయతో అందరికీ శుభం కలిగించాలని ముంపు కష్టాలు వీడేలా .. అభయమివ్వు గణేశా కోరుకుంటున్నట్టు తెలిపారు.
వాడవాడలా చవితి పందిళ్లతో కళకళలాడాల్సిన సమయంలో వచ్చిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు విజయవాడ ప్రజలను తీవ్ర కష్టాల పాలుచేశాయని చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ప్రజలకు ఎలాంటి విపత్తులు రాకుండా చూడాలని ఆ వక్రతుండ మహా గణపతిని కోరుకుంటున్నట్టు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, ప్రజల సౌభాగ్యం అవిఘ్నంగా కొనసాగాలని, విఘ్నాలకు అధిపతి అయిన గణనాథుడిని మనసారా వేడుకుంటున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. వరదలతో భీతిల్లుతున్న తరుణంలో వచ్చిన ఈ వినాయక చవితిని భక్తిప్రపత్తులతో ఆనందదాయకంగా జరుపుకునే పరిస్థితులు లేకపోవడం దురదృష్టకరమని జనసేనాని విచారం వ్యక్తం చేశారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- జమ్మూకశ్మీర్లోని ఉదంపూర్ జిల్లాలో ఘోర ప్రమాదంజమ్మూ కశ్మీర్లోని ఉదంపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉధంపూర్–రామ్నగర్ మార్గంలోని జాలో ప్రాంతంలో బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 20కి చేరింది మృతుల సంఖ్య. మరో 30 మందికి పైగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు,…
- సమ్మెకు సిద్ధమైన తెలంగాణ ఆర్టీసీ కార్మికులు..తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు మరోసారి సమ్మె బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం గడువు ముగుస్తుండటంతో మరో 48 గంటల్లో సమ్మెకు వెళ్లేందుకు అన్ని డిపోల ఆర్టీసీ జేఏసీ నేతలు సన్నద్ధమయ్యారు. అయితే, ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి…
- ‘ఓం శాంతి డిస్కో శాంతి’ ఆల్ రెడీ కాషన్ కియా.. ఆల్ రెడీ’. టైటిల్, మోషన్ పోస్టర్ విడుదల…ఆనందో బ్రహ్మ, సేవ్ ది టైగర్స్ వంటి ఎంటర్టైనర్స్ సృష్టికర్త మహి వి.రాఘవ్ నుంచి రాబోతున్న మరో సరికొత్త కామెడీ హారర్ చిత్రం ‘ఓం శాంతి డిస్కో శాంతి’. ‘ఆల్ రెడీ కాషన్ కియా.. ఆల్ రెడీ’ క్యాప్షన్. మరోసారి ప్రేక్షకులను…
- తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు ..తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి 41 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నటుడు, మాజీ మంత్రి, విశ్వ నట సామ్రాట్ డాక్టర్ బాబు మోహన్ గారికి తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే…
- టపాసుల తయారు ఫ్యాక్టరీలో భారీ పేలుడు, 18 మంది మృతి..!తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విరుద్నగర్ జిల్లాలోని కట్టనార్పట్టిలో ఉన్న బాణసంచా పరిశ్రమలో ఆదివారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 18 మంది చనిపోగా…. మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదం ఉందని సమాచారం. భారీ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 46154