Wednesday, April 15, 2026
News Navigation
Wednesday, April 15, 2026
News Navigation

Breaking

Wednesday, April 15, 2026
Home Andhra Pradesh తిరుమలలో సిఫారసు లేఖల దుర్వినియోగంపై నిఘా

తిరుమలలో సిఫారసు లేఖల దుర్వినియోగంపై నిఘా

by Rama
తిరుమలలో సిఫారసు లేఖల దుర్వినియోగంపై నిఘా

తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రజాప్రతినిధులు, అధికారుల సిఫారసు లేఖలపై ఇచ్చే టికెట్లను టిటీడీ నిశితంగా పరిశీలిస్తోంది. దుర్వినియోగానికి పాల్పడుతున్నవారిపై నిఘా పెట్టింది. సిఫారసు లేఖల్ని ఇష్టానుసారం వినియోగించడంలో అధికార, ప్రతిపక్షాలనే తేడా లేకుండా ఉందని అధికారులు గుర్తించారు. దుర్వినియోగానికి పాల్పడుతున్న ప్రజాప్రతినిధుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. ఇందులో ఒకరిద్దరు మంత్రులూ ఉన్నట్లు సమాచారం. ఈ జాబితాను త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమర్పించి ఆయన ఆదేశాలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు.

వైసీపీ హయాంలో వీఐపీ బ్రేక్, శ్రీవాణి దర్శనాల్లో భారీగా అవకతవకలు చోటుచేసుకున్నాయి. కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు సెల్ఫ్‌ సిఫారసు లేఖలను టీటీడీ సమర్పించి… తమవెంట 50 నుంచి 100 మందిని తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. దీనిని కట్టడి చేస్తే… శ్రీవారిని దర్శించుకునేందుకు సామాన్యభక్తులకు అదనంగా మరో గంట సమయాన్ని అందుబాటులోకి తేవొచ్చని టీటీడీ భావిస్తోంది.

మరోవైపు ప్రతినెలా ఖాళీగా ఉన్న ఆర్జిత సేవల టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేసి డిప్‌ ద్వారా టీటీడీ కేటాయిస్తుంది. ఒక్కసారి ఆర్జితసేవ టికెట్‌ పొందిన భక్తుడికి మళ్లీ మూడు నెలల తర్వాతే దర్శనానికి అవకాశం ఉంటుంది. ఇలా సామాన్య భక్తులకు ఒక రీతి… వీఐపీలకు మరో రీతి ఉండటంపై భక్తులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ..
    ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు సీఎం రేవంత్‌రెడ్డి. డీలిమిటేషన్‍తో సౌత్‌ స్టేట్స్‌తో పాటు చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఈ నిర్ణయంతో బీజేపీకి తాత్కాలికంగా లాభం జరగవచ్చు కానీ..దీర్ఘకాలంలో దేశానికి నష్టమన్నారు సీఎం రేవంత్ రెడ్డి..ఈ మేరకు డీలిమిటేషన్ విషయంలో…
  • శ్రీశైలం మహాక్షేత్రంలో భారీగా భక్తుల రద్దీ..
    నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవులు రావడంతో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థం వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు క్యూలైన్లలో బారులు తీరుతున్నారు. ప్రస్తుతం దర్శనానికి సుమారు…
  • భారత భూభాగాలకు చైనా కల్పిత పేర్లు..
    అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ప్రాంతాలకు చైనా కల్పిత పేర్లు పెట్టడాన్ని భారత్‌ తీవ్రంగా ఖండించింది. చైనా చర్య దురుద్దేశపూరితమంటూ మండిపడింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ ఎప్పటికీ భారత్‌లో విడదీయలేని అంతర్భాగమేనని తేల్చి చెప్పింది. కల్పిత పేర్లు పెట్టడం ద్వారా వాస్తవాలను మార్చలేరని స్పష్టం చేసిన…
  • హైదరాబాద్‌లో అంతులేకుండా పోతున్న రియల్‌ మోసాలు..
    హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ సంస్థల ఆగడాలకు హద్దూ అదుపూ లేకుండా పోతోంది. చిన్న చితకా సంస్థల నుంచి మొదలుపెట్టి… బడా బడా కన్‌స్ట్రక్షన్‌ కంపెనీల వరకూ అందరూ నిబంధనలను తుంగలో తొక్కేవారే. కొంచెం ఎక్కువ… కొంచం తక్కువ అనే తప్ప… ఉల్లంఘనలకు…
  • పశ్చిమాసియాలో మళ్లీ మొదటికొచ్చిన పరిస్థితి..
    పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. పాకిస్థాన్‌ వేదికగా అమెరికా – ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో… మళ్లీ యుద్ధం మొదలయ్యే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ దిశగా ట్రంప్‌ అనేక సూచనలు కూడా ఇచ్చారు. దీంతో…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

005714
Total views : 38498

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.