Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home Latest News ఓట్లు వేయించుకోవడం కాదు పనులు కూడా చెయ్యాలా…

ఓట్లు వేయించుకోవడం కాదు పనులు కూడా చెయ్యాలా…

by Prakash
Women


మహిళలు (Women) ఖాళీ బిందెలతో ఎర్రటి ఎండలో నిరసన..

ఓట్లు వేయించుకోవడంలో ఉన్న శ్రద్ధ మౌలిక వసతులు కల్పించడంలో చూపడం లేదని మహిళలు (Women) ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ కాలనీ కి మౌలిక సదుపాయాలు కల్పించకుంటే రాబోయే పార్లమెంటు ఎన్నికలు బహిష్కరిస్తామని ముక్త కంఠంతో చెబుతున్నారు. గత పాలకుల తప్పిదాలతో తీవ్ర మంచినీటి సమస్య ఏర్పడిందని, ఎన్ని సార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో మహిళలందరూ ఖాళీ బిందెలతో ఎర్రటి ఎండలో నిరసన తెలిపారు.

మున్సిపల్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో బైఠాయించిన మహిళలు..

సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ పరిధిలోని రెండో వార్డు కౌన్సిలర్ గోపాలమ్మ వెంకటయ్య ఆధ్వర్యంలో బీసీ కాలనీ మహిళలు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో బైఠాయించారు. 1983 లో ఏర్పడిన తమ కాలనీకి త్రాగునీరు, మౌళిక సదుపాయాలు కల్పించడంలో గత పాలకులందరూ విఫలమయ్యారన్నారు. తమ సమస్యలను పరిష్కరించకుంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు చెప్పారు.

మున్సిపల్ మేనేజర్ నిర్మలా రెడ్డి కి వినతి పత్రం..

కాలనీలో మంజీరా నీటి సరఫరా లేదని, విద్యుత్ సౌకర్యం లేదని, వీధి లైట్లు లేవని వాపోయారు. గతంలో కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, తెలంగాణ రాష్ట్ర గవర్నర్, లోకాయుక్త కోర్టుకి తమ సమస్యల గురించి అనేక సార్లు వినతి పత్రం అందజేసినా ఫలితం లేదన్నారు. గత 30 ఏళ్లుగా ఓట్లు వేయించుకుంటూ అభివృద్ధిలో నిర్లక్ష్యం, కక్ష సాధింపు చర్యలు వల్ల తమ కాలనీ వాసులు ఎంతో వెనుకబడి పోయామన్నారు. అనంతరం మున్సిపల్ మేనేజర్ నిర్మలా రెడ్డి కి వినతి పత్రాన్ని అందజేశారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


నీట్‌ నిరసన సెగ హైదరాబాద్‌ కు తగిలింది.
నీట్‌ నిరసన సెగ హైదరాబాద్‌ కు తగిలింది. నాంపల్లి పరిసర ప్రాంతాలు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల …
సి.వి.రావును కలిసిన సినీ నిర్మాత, కాంగ్రెస్‌ నేత బండ్ల గణేష్.
ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్ ఈరోజు ఇమేజ్ హాస్పిటళ్లు, సీవీఆర్ …
వికారాబాద్‌ జిల్లాలో ఆశ్రమం మాటున గంజాయి సాగు.
వికారాబాద్ జిల్లాలో ఆశ్రమం మాటున జరుగుతున్న గంజాయి సాగు కలకలం రేపింది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాల్సిన …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

042274
Total views : 223707

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: