ఎల్బీనగర్ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కిగౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. కొంతమంది కార్యకర్తలతో ముందుగా ఒక సెట్ నామినేషన్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ భవిష్యత్తు కొరకై, తెలంగాణ ప్రజల కొరకై, తెలంగాణ ను రక్షించడం కొరకై జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఏ తెలంగాణ రాష్ట్రం కోసం అమరవీరులు తమ ప్రాణాలను అర్పించారో వారి ఆశయ సాధన కోసం బిఆర్ఎస్ పార్టీ ఏమీ చేయడం లేదని ఆయన ఆరోపించారు. వారి అమరవీరుల త్యాగాలను ఫణంగా పెట్టి బిఅర్ఎస్ అధికారం చేపట్టారని ఆరోపించారు. బిజెపి , బిఅర్ఎస్ పార్టీ లు రెండు ఒకటేనని ఆయన ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బలపరిచి తమను గెలిపించాల్సిందిగా మదు యాష్కీ కోరారు.