Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Latest News బీజేపీ, కాంగ్రెస్ ను గెలిపిస్తే అంధకారమే..

బీజేపీ, కాంగ్రెస్ ను గెలిపిస్తే అంధకారమే..

by Prakash
minister gangula kamalakar

పార్టీలో టికెట్లు ఇస్తానని చెప్పి కోట్ల రూపాయలు వసూళ్లు చేసిన వ్యక్తి బండి సంజయ్ అని ఆ అవినీతి సొమ్ముతో గెలిచేందుకు మళ్ళీ వస్తున్నాడని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామంలో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామస్థులు పెద్ద ఎత్తున డప్పు చప్పుళ్ళు, తెలంగాణ సాంప్రదాయం ఉట్టి పడేలా బతుకమ్మ బోనాలతో ఘన స్వాగతం పలికారు. మంత్రి గంగుల ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ…బీసీ బిడ్డ తుల ఉమ పోటీ చేసేందుకు సిద్ధం కాగా ఆమెకు వ్యతిరేకంగా నిలిచిన వ్యక్తికి 20 కోట్ల రూపాయలకు టికెట్ బండి సంజయ్ అమ్ముకున్నడని ఆరోపించారు. సంజయ్ ఎన్నికలు వచ్చిన ప్రతీ సారి ఎదో ఒక డ్రామా ఆడి ఓట్లు దండుకావాలని చూస్తాడని, ఆయన యాక్టింగ్ బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ లను మించిపోయిందని ఎద్దేవా చేసారు. భు మాఫియాకు మారుపేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని, ఆయన సర్పంచ్ గా అవకాశం ఇస్తే కబ్జాలు చేసిన వ్యక్తి ఎమ్మెల్యే అయితే మీ భూములు, ప్రభుత్వ భూములు కబ్జా చేస్తాడని అన్నారు. బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులు భూమాఫియా లో భాగస్వాములు అని అన్నారు. తనకు వ్యాపారాల వల్ల డబ్బులు సంపాదిస్తే బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులు ఏ వ్యాపారం చేసి కోట్ల రూపాయలు సంపాదించారో చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కబ్జాల వల్ల బొమ్మకల్ గ్రామంలోని భూ రికార్డులు సీబీసీఐడీ వద్ద ఉండే దుస్థితి దాపురించింది అని అన్నారు. 12 ఇళ్లులు కట్టుకున్న కాంగ్రెస్ అభ్యర్థి గ్రామపంచాయతీ భవనం కట్టలేకపోయడని అన్నారు. ఎంపీగా బండి సంజయ్ ను గెలిపిస్తే ఒక్క రోజు ఏ గ్రామానికి రాని వ్యక్తి మళ్ళీ ఓట్ల కోసం ఏ ముఖం పెట్టుకొని వస్తున్నాడని, మహిళలు నిలదీయాలని కోరారు. రానున్న ఎన్నికలు మీ బిడ్డల భవిష్యత్ ను సూచించే ఎన్నికలు అని, ఒక్క ఓటు తప్పు జరిగితే మీ పిల్లల భవిష్యత్ అంధకారం అవుతుందని అన్నారు.

Advertisements

You may also like

Our Visitor

026085
Total views : 149904

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.