Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Main News సోనియా గాంధీ రుణం తీర్చుకున్న తెలంగాణ ప్రజలు….

సోనియా గాంధీ రుణం తీర్చుకున్న తెలంగాణ ప్రజలు….

by Prakash
Sonia Gandhi's birthday celebrations

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన త్యాగశీలి శ్రీమతి సోనియా గాంధీ రుణాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు తీర్చుకున్నారని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం లోని ఆయన నివాసంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు .
ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పథకం ద్వారా 10 లక్షల రూపాయల పెంపు కార్యక్రమాన్ని ఈరోజు నుండి ప్రారంభించడం జరిగిందని భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని ఆయన తెలిపారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిన సోనియా గాంధీ రుణాన్ని తెలంగాణ ప్రజలు తీర్చుకున్నారని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరే విధంగా పార్టీ కార్యకర్తలు పని చేయాలని కార్యకర్తలను కోరారు. రాబోవు సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీదే విజయమని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు పని చేయాలని ఆయన కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో నాయిని యాదగిరి, సర్దార్ ఖాన్, మొనగారి రాజు, నక్క రాములు గౌడ్ , అఙ్గర్, నేత నాగరాజు, గుండు లక్ష్మణ్ ఆంజనేయులు యాదవ్, యువజన కాంగ్రెస్ నాయకులు రాజశేఖర్ రెడ్డి, పంజాల రమేష్ గౌడ్, టిల్లు రెడ్డి, కేసారం బాబా, మల్లారెడ్డి, మామిడి కృష్ణ, దాబా శ్రీనివాస్,ఆటో షఫీ , మంగళ్ పాండే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: