గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ పెదనందిపాడు మండలం వరగాని మూలమలుపు వద్ద ఓల్డ్ మద్రాస్ రోడ్డు పక్కన ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగలు పగలగొట్టారు. ఈ మూల మలుపు వద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ట చేయకముందు రోజుకు ఒక ప్రమాదం జరిగి ఎవరో ఒకరు చనిపోతున్నారని గ్రామస్తులు అందరూ కలిసి విగ్రహం ప్రతిష్టించారు. ఇప్పుడు ఇలా జరగటం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి అని, ఇలాంటి ఆకతాయి పనులు చేసిన వారిని పోలీసులు వెంటనే పట్టుకొని తగు శిక్ష విధించాలని గ్రామస్తులు కోరుతున్నారు.