Wednesday, June 3, 2026
News Navigation
Wednesday, June 3, 2026
News Navigation

Breaking

Wednesday, June 3, 2026
Home International క్రికెట్ లో ఫిక్సింగ్ భూతం కలకలం..

క్రికెట్ లో ఫిక్సింగ్ భూతం కలకలం..

by Prakash
nasir hussain

క్రికెట్ లో ఫిక్సింగ్ భూతం అంతమయ్యేలాలేదు. తాజాగా, బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ నాసిర్ హోస్సేన్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఐసీసీ ఆగ్రహానికి గురయ్యాడు. 2021-22 సీజన్ లో జరిగిన అబుదాబి టీ10 లీగ్ లో నాసిర్ హొస్సేన్ ఫిక్సింగ్ కు పాల్పడినట్టు నిర్ధారణ అయింది. ఆ సమయంలో అతడు పుణే డెవిల్స్ టీమ్ కు ప్రాతినిధ్యం వహించాడు. హొస్సేన్, మరో ఏడుగురు ఫిక్సింగ్ కు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఫిక్సింగ్ కు సంబంధించిన అంశాలను బుకీలతో ఫోన్ లో మాట్లాడడం, వారి నుంచి ఐఫోన్ ను గిఫ్ట్ గా పొందడం, బుకీలు తనను సంప్రదించిన విషయాన్ని ఐసీసీ అవినీతి నిరోధక విభాగానికి తెలియజేయకపోవడం వంటి అభియోగాలు నిజమేనని వెల్లడైంది. దాంతో అతడిపై ఐసీసీ రెండేళ్ల నిషేధం విధించింది. కాగా, తనపై వచ్చిన ఆరోపణలను నాసిర్ హొస్సేన్ అంగీకరించాడు.

Advertisements

You may also like

Our Visitor

019584
Total views : 91177

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.