Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Andhra Pradesh ప్రతిపక్షాలను బూతులు తిట్టడం కాదు… రైతు సమస్యలు కూడా తీర్చాలి

ప్రతిపక్షాలను బూతులు తిట్టడం కాదు… రైతు సమస్యలు కూడా తీర్చాలి

by Prakash
Review meeting with officials on purchase of grain

ప్రభుత్వ ఆనాలోచన నిర్ణయం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి అన్నారు. ఉయ్యూరు ఆర్టీవో కార్యాలయంలో ధాన్యం కొనుగోలు పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి తో పాటు ఆర్డిఓ రాజు, ఎమ్మార్వో మస్తాన్ రావు, నగర పంచాయతీ కమిషనర్ పాయసం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆర్ బి కే నుండి మిల్లర్లకు తరలించిన ధాన్యం రోజుల తరబడి దిగుమతి చేసుకోకుండా తేమ శాతం పేరుతో బస్తాకు 300 నుంచి 400 రూపాయలు తగ్గించి ఇస్తున్నారని దీనిపైన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పార్థసారథి ప్రభుత్వ అనుసరిస్తున్న విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించడం లేదని అలాగే తేమశాతం పేరుతో మిల్లర్లు రైతులను మోసగిస్తున్న అధికారులు, మంత్రులు స్పందించడం లేదని అన్నారు. పకృతి విపత్తు వల్ల ఈ సంవత్సరం కుప్పనూరుపుళ్ళు మార్చి తర్వాత కూడా జరుగుతాయని కానీ ప్రభుత్వం మార్చి తర్వాత ధాన్యం కొనుగోలు చేస్తామని భరోసాని మాత్రం రైతులకు కల్పించడం లేదని అన్నారు. మంత్రులు ప్రతిపక్షాలను బూతులు తిట్టడమే కాదని రైతు సమస్యలను అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించాలని చురక అంటించారు. ఇక్కడ ధాన్యాన్ని కడప, కర్నూలు, నెల్లూరు మిల్లులకు తరలించి ఇక్కడ మిల్లర్లకు సైతం ప్రభుత్వం అన్యాయం చేస్తుందని సారధి తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

014201
Total views : 79544

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.