దేశమంతటా 500 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న అయోధ్య రాముని విగ్రహ ప్రతిష్టకు గ్రామ గ్రామాన ఎంతో ఉత్సాహభరితంగా, ఆనంద ఉల్లాసాలతో అయోధ్య శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు కంబాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ రోజు తెల్లవారుజాము 5 గంటల నుంచి నగర సంకీర్తన ప్రతి ఇంటి ముందు శ్రీరామ్ జయరాం రంగవల్లికలతో అలంకరించుకుని సుందరకాండ పారాయణము శ్రీరామ నామ జపము లాంటివి గోకవరంమండలంలో ప్రతి ఆలయం వద్ద చాలా భక్తితో జరిపించుకున్నారు. గోకవరం పట్టాభి రామాలయం నుంచి 40 గ్రామాలలో బైక్ ర్యాలీ నిర్వహించారు. శ్రీరాముల ఉత్సవ విగ్రహాలను గ్రామాలలో వీధి వీధినా ఊరేగించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు విక్షేంచే విధాంగా అయోధ్య లో జరిగే ప్రతి ఎల్.ఇ.డి తెరలపై చూపించారు. 10 వేలమందికి పైగా అన్న సమారాధన కార్యక్రమలు జరిగాయి.
ఆనంద ఉల్లాసాలతో అయోధ్య రాముని విగ్రహ ప్రతిష్ట వేడుకలు…
314
previous post






Total views : 78453