యాదాద్రి భువనగిరి జిల్లా.. భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. సమావేశానికి భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు. ఓటమి శాశ్వతం కాదు. గెలుపుకు నాంది. ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమే. ఎన్నికల హామీలను నిలబెట్టుకోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ప్రచారంలో అబద్ధాలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చాక అసహనం పెరిగిందని హరీష్ రావు ఆరోపించారు. కార్యకర్తలందరూ కష్టపడండి.. ఎంపీ సీటు మనదే. స్థానిక ఎన్నికల్లో కష్టపడి పోరాడి సత్తా చూపిద్దాం. తెలంగాణకు శ్రీరామరక్ష బీఆర్ఎస్ పార్టీనే. కాంగ్రెస్, బీజేపీలు వాటి స్వార్థం కోసమే పనిచేస్తాయి. బీఆర్ఎస్ తెలంగాణ ప్రయోజనాల కోసమే పోరాడుతుంది. కర్నాటక కాంగ్రెస్ను ప్రజలు తిరస్కరిస్తున్నారు. అక్కడి 25 ఎంపీ సీట్లలో నాలుగైదు మాత్రమే వస్తాయంటున్నారు. ఇక్కడ కూడా హామీలను విస్మరించిన కాంగ్రెస్కు అదే గతి పడుతుందని హరీష్ రావు విమర్శించారు.
ఓటమి శాశ్వతం కాదు.. గెలుపుకు నాంది..
673
previous post