Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Latest News నకిలీ ధ్రువ పత్రాలతో భారీ మోసం…

నకిలీ ధ్రువ పత్రాలతో భారీ మోసం…

by Prakash
Arrest of husband and wife who committed fraud by creating fake identity documents and selling them

కరీంనగర్ గాంధీనగర్ కి చెందిన సింగిరెడ్డి మోహన్ రెడ్డి తండ్రి నర్సింహారెడ్డి వ్యాపారి వద్ద నుండి 2016 లో గంగాధర మండలం హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన మాల కనకయ్య ముప్పై లక్షల రూపాయలు, 2017 లో మరో ఇరువై ఆరు లక్షల రూపాయలు అప్పుగా తీసుకుని హామీగా మాల కనకయ్య అతని భార్య మాల మంజుల తన పేరిట ఉప్పర మల్యాల రెవిన్యూ గ్రామ శివారులో వున్న మూడెకరాల ముప్పైతొమ్మిదిన్నర గుంటల భూమిని మోహన్ రెడ్డి పేరిట మార్టిగేజ్ చేయడమే గాక రెండు బ్యాంకు చెక్కులను సైతం ఇచ్చారు. ఇట్టి విషయాన్నీ దాచి పెట్టి అదే భూమిపై నకలు ధ్రువపత్రాలు సృష్టించి వేరే వ్యక్తులకు విక్రయించారని, విషయం తెలుసుకుని నిందితులను నిలదీసిన బాధితుడు మోహన్ రెడ్డిని చంపుతామని బెదిరింపులకు గురిచేసారని, బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గంగధార పోలీస్ స్టేషన్ నందు గురువారం నాడు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణలో ఫిర్యాదులో తెలిపిన విషయం వాస్తవమేనని తేలినందున భార్యాభర్తలయిన మాల కనకయ్య మరియు మాల మంజుల ఇరువురిని అదుపులోకి తీసుకుని గౌరవ కోర్టులో హాజరు పరచగా కేసును పరిశీలించిన గౌరవ మేజిస్ట్రేట్ నిందితులిద్దరికి 14 రోజుల రిమాండ్ విదించినందున, వారిని జైలుకు తరలించారు.

Advertisements

You may also like

Our Visitor

039058
Total views : 194140

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: