కరీంనగర్ పట్టణంలోని తెలంగాణ చౌక్ లో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కాంగ్రెస్ కార్యకర్తల ధర్నా ఈ ధర్నాలో భాగంగా పట్టణ మరియు చుట్టుపక్క నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు హాజరై మోడీ హటావో దేశ్ బచావో నినాదాలు చేశారు. మన కొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల వేల 18,23 కోట్లు చెల్లించాలని కాంగ్రెస్ పార్టీకి ఆదాయ పన్ను విభాగం నోటీసు ఇవ్వడం వెనుక బిజెపి కుట్ర ఉందని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా కృంగదీయాలని బిజెపి ప్రయత్నిస్తుందని 2014లో రకరకాల వాగ్దానాలు చేసి బిజెపి ప్రభుత్వం లోకి వచ్చిందని తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేశారని బిజెపికి ఈసారి ప్రజలు కచ్చితంగా బుద్ధి చెప్తారని ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటారని ప్రజల సొమ్ముకు బిజెపి లెక్క చెప్పవలసి ఉంటుందని రానున్న రోజుల్లో బిజెపిని ప్రజలు తరిమికొడతారని హెచ్చరించారు.
తెలంగాణ చౌక్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తల ధర్నా..
320
previous post






Total views : 147900