Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Latest News క్రికెట్ చూడండి తప్పులేదు.. జర రైతులను కూడా పట్టించుకోండి సారూ

క్రికెట్ చూడండి తప్పులేదు.. జర రైతులను కూడా పట్టించుకోండి సారూ

by Prakash
Rythu Diksha in Jagityala district

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం పూట క్రికెట్ మ్యాచ్ చూడండి తప్పులేదు కానీ రైతుల గురించి కూడా పట్టించుకోండి అని జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్ అన్నారు. మెట్ పల్లి పట్టణంలోని పాత బస్ స్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన రైతు దీక్షలో ఆయన పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరిగాయి అని అన్నారు. రైతులకు ఇచ్చిన ఒక్క మాట కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేక పోయిందని అన్నారు. రైతులకు తక్షణమే రైతు రుణ మాఫీ, పంట నష్ట పరిహారం, వరి పంటకు బోనస్ అందించాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కళకళలాడిన చెరువులు, కుంటలు, కాలువలు నేడు వెల వెల బోతున్నాయని అన్నారు. రైతులు ఎవరు ఎవరు అధైర్య పడి ఆత్మహత్యలు చేసుకోవద్దని బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

025683
Total views : 147680

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.