Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Andhra Pradesh కార్యకర్తల బహిరంగ అభిప్రాయాల సేకరణ…

కార్యకర్తల బహిరంగ అభిప్రాయాల సేకరణ…

by Prakash
Yallathuri Srinivasaraju

అన్నమయ్య జిల్లా రాజంపేటలో జనసేన పార్టీ నేత యల్లటూరి శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో తోట కళ్యాణ మండపంలో పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుండుపల్లి, వీరపల్లి, ఒంటిమిట్ట, సిద్దవట్టం, రాజంపేట, నందలూరు మండలాల నుంచి పెద్దఎత్తున జనసేన శ్రేణులు పాల్గొన్నారు. ఈ సభలో కార్యకర్తల బహిరంగ అభిప్రాయాల సేకరణ నిర్వహించారు. వారు యల్లటూరి శ్రీనివాసరాజు తెలుగుదేశం వెంట నడవాలని, భారీ మెజారిటీతో గెలిపించు కోవాలని సూచించారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి బాలసుబ్రమణ్యం రాజంపేట అభివృద్ధికి జనసేన, టీడీపీ కలిసి కృషి చేస్తాయని హామీ ఇచ్చారు. జనసేన టిక్కెట్ రాలేదని తిరుగుబాటు చేయకుండా, సంస్కారవంతంగా సహకరించిన విద్యావంతుడు యల్లటూరి శ్రీనివాసరాజును సుగవాసి కొనియాడారు.

Advertisements

You may also like

Our Visitor

019368
Total views : 90565

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.