Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Telangana లోక్‌స‌భ ఎన్నిక‌లకు శంఖ‌రావం పూరించిన కేసీఆర్…

లోక్‌స‌భ ఎన్నిక‌లకు శంఖ‌రావం పూరించిన కేసీఆర్…

by Prakash
KCR filled Shankaravam for Lok Sabha elections..

బీఆర్ఎస్ ఛీఫ్ కేసీఆర్ లోక్‌స‌భ ఎన్నిక‌ల శంఖ‌రావానికి సిద్ధ‌మ‌య్యారు. ఇవాళ్టి కేసీఆర్ ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారు. అందులో భాగంగా నేడు చేవెళ్ల లోక్‌స‌భ అభ్య‌ర్థి కాసాని జ్ఞానేశ్వ‌ర్‌కు మ‌ద్ధ‌తుగా నిర్వ‌హించే ప్రజా ఆశీర్వాద సభలో ఆయ‌న పాల్గొనున్నారు. నేటి సాయంత్రం ఫరా ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో జరగనున్న ఈ సభకు పార్టీ చీఫ్​ కేసీఆర్, ముఖ్యనేతలు హాజరు కానున్నారు. సభకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని, సుమారు 2 లక్షల మంది ఈ సభకు హాజరయ్యేలా జన సమీకరణ చేసేందుకు చేవెళ్ల బీఆర్ఎస్ నాయకులు స‌న్నాహాలు చేశారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు గులాబీ కార్యకర్తలు అలాగే లీడర్లు. ఇక ఇవాళ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగం ఎలా ఉంటుందో చూడాలి.

Advertisements

You may also like

Our Visitor

026107
Total views : 149927

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.