వైసిపి అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు (Simhadri Ramesh Babu), మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర రావు గెలుపే దిశగా ఫ్రతిరోజు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తు పైన ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలు స్వతహాగా ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఈరోజు అవనిగడ్డ వైసీపీ పార్టీ కార్యలయం నుంచి పలు గ్రామాల మీదుగా కోడూరు వరకు సింహాద్రి రమేష్ బాబు ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించడంతో రహదారులు కిక్కిరిసిపోయాయి. వైసీపీకి మద్దతుగా వేలాదిగా వైసీపీ శ్రేణులు సింహాద్రి రమేష్ బాబు విజయం కోరుతూ ఉత్సాహంగా రోడ్ షో లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు కు దారి పొడవునా మహిళలు హారతులతో స్వాగతం పలికారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈ సందర్భంగా అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ… నేను విన్నాను నేను ఉన్నాను అంటూ ఇచ్చిన మాట ప్రకారం ప్రజలందరికీ సంక్షేమాన్ని అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. మళ్లీ రాష్ట్ర ప్రజలందరూ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. జూన్ 4 తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని అన్నారు. రేపు జరగబోయే ఎన్నికలలో నియోజకవర్గ ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అవనిగడ్డ శాసనసభ్యునిగా తనని మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ రావు గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీరితోపాటు అవనిగడ్డ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
- ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్న్యూస్.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రెండు డీఏలను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన డీఏలను సెప్టెంబరు నెల జీతంతో కలిపి చెల్లించాలని ఆదేశించింది. 2025 జనవరి 1 నుంచి 1.82 శాతం…
- ఏపీకి భారీ వర్షసూచన.. 9 జిల్లాలకు అలర్ట్.ఏపీలో వాతావరణశాఖ భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజులపాటు తొమ్మిది జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విశాఖ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో…