Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Latest News మెదక్ జిల్లా కలెక్టర్ పొలంలోకి దిగి వరి నాట్లు

మెదక్ జిల్లా కలెక్టర్ పొలంలోకి దిగి వరి నాట్లు

by Rama
మెదక్ జిల్లా కలెక్టర్ పొలంలోకి దిగి వరి నాట్లు

మహర్షి మూవీలో కథానాయకుడిలా మెదక్ జిల్లా కలెక్టర్ పొలంలోకి దిగి వరి నాట్లు వేశారు. రైతే దేశానికి వెన్నుముక అని తెలిసిన కలెక్టర్ రాహుల్ రాజ్ రైతులతో మమేకమై పొలం పనులు చేశారు. కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ కు ఆనుకుని ఔరంగాబాద్ గొల్ల నారాయణ రైతు పొలం ఉంది. వారాంతంలో తమ పిల్లలను తీసుకుని రైతులతో కలిసి రాహుల్ రాజ్ దంపతులు ఆ పొలంలో వరి నాట్లువేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడారు. జిల్లాలో సుమారు 70వేల రైతులు ఉన్నారు. అందులో నాలుగు వందల నలభైఏడుకోట్ల రైతు రుణమాఫీ నిధులను ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. రైతులకు ప్రతి దశలో అవసరమైన సలహాలు, సూచనలు అందజేసి.. లాభదాయక సాగు చేసే దిశగా అధికారులు పని చేయాలని ఆదేశించారు. వరి నాట్లు వేస్తున్న రైతుల పొలాలను కలెక్టర్ పరిశీలించారు. పంటకు సంబంధించిన అంశాలపై రైతులను అడిగి తెలుసుకున్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.
    మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2021లో పంచాయతీ ఎన్నికల సమయంలో నమోదైన కేసులో ప్రాసిక్యూషన్‌కు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. 2021 ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో…
  • హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.
    హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియ విరిగిపడటంతో ధల్లి… సంజౌలి బైపాస్‌ను పూర్తిగా మూసివేశారు. దీంతో ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొండచరియ విరిగిపడటంతో భారీగా శిథిలాలు రహదారిపైకి వచ్చిపడ్డాయి. శిథిలాలు అడ్డంకి ఉండటంతో వాహనాల రాకపోకలకు…
  • అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.
    అమెరికాలోని న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌ వద్ద కాల్పులు కలకం సృష్టించాయి. కాల్పులకు తెగబడటమే కాకుండా ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. నిత్యం రద్దీగా ఉండే మాన్‌హాటన్ పర్యాటక ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల శబ్దం వినిపించడంతో పర్యాటకులు, స్థానికులు…
  • అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.
    ఏపీలో మరో బస్సు ప్రమాదం జరిగింది. అయితే వెంటనే అప్రమత్తం కావడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయట పడ్డారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం రేగుపాలెం జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భువనేశ్వర్ నుంచి చెన్నై…
  • వర్షం వస్తేనే జంకుతున్న భద్రాద్రి గిరిజన గ్రామాలు.
    ఆకాశం నల్లటి మబ్బులు కమ్ముకుంటుంటే అన్నదాత ఆనందంతో మురిసిపోతాడు. కానీ… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారాంపురం పంచాయతీ పరిధిలోని అన్నారం, చింతలపాడుతో పాటు మరో మూడు గిరిజన గ్రామాల ప్రజల గుండెల్లో మాత్రం వణుకు మొదలవుతుంది. వారికి వర్షం అంటే పరవశం…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

026118
Total views : 149938

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.