వైసీపీ ప్రభుత్వం జిల్లాలను విభజించి తప్పు చేసిందని ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రి, బీజేపీ నేత నేత నల్లారి కిరణ్కుమార్రెడ్డి తెలిపారు. తాను కనుక సీఎంగా ఉండి ఉంటే విడగొట్టిన జిల్లాలను మళ్లీ కలిపేసి ఉండేవాడనని చెప్పారు. చంద్రబాబు ఏపీకి మళ్లీ సీఎం కావడంపై సంతోషం వ్యక్తం చేశారు. చంద్రబాబు ముందు చాలా సవాళ్లు ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో వాటిని పరిష్కరించాలని సూచించారు. రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రభుత్వానికి సూచించారు. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లూ రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయని విమర్శించారు. జిల్లాలను విడదీసి తప్పు చేసిన వైసీపీ ప్రభుత్వం. ప్రస్తుతం జరుగుతున్న కొన్ని ఘటనలు వాటి పర్యవసానమేనని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిజేష్కుమార్ ట్రైబ్యునల్ను తప్పిస్తేనే తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల సమస్య పరిష్కారం అవుతుందని కిరణ్కుమార్ చెప్పారు. ఈ ట్రిబ్యునల్పై తీర్పుపై తాను స్టే తీసుకొచ్చి 11 ఏళ్లు అవుతోందని గుర్తు చేశారు. నదీ జలాల విషయంలో అప్రమత్తం కాకుంటే రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతుందని కిరణ్కుమార్రెడ్డి హెచ్చరించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్సిగ్నల్.మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. 2021లో పంచాయతీ ఎన్నికల సమయంలో నమోదైన కేసులో ప్రాసిక్యూషన్కు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. 2021 ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో…
- హిమాచల్ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియ విరిగిపడటంతో ధల్లి… సంజౌలి బైపాస్ను పూర్తిగా మూసివేశారు. దీంతో ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొండచరియ విరిగిపడటంతో భారీగా శిథిలాలు రహదారిపైకి వచ్చిపడ్డాయి. శిథిలాలు అడ్డంకి ఉండటంతో వాహనాల రాకపోకలకు…
- అమెరికా: న్యూయార్క్లో కాల్పుల కలకలం.అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద కాల్పులు కలకం సృష్టించాయి. కాల్పులకు తెగబడటమే కాకుండా ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. నిత్యం రద్దీగా ఉండే మాన్హాటన్ పర్యాటక ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల శబ్దం వినిపించడంతో పర్యాటకులు, స్థానికులు…
- అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.ఏపీలో మరో బస్సు ప్రమాదం జరిగింది. అయితే వెంటనే అప్రమత్తం కావడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయట పడ్డారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం రేగుపాలెం జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భువనేశ్వర్ నుంచి చెన్నై…
- వర్షం వస్తేనే జంకుతున్న భద్రాద్రి గిరిజన గ్రామాలు.ఆకాశం నల్లటి మబ్బులు కమ్ముకుంటుంటే అన్నదాత ఆనందంతో మురిసిపోతాడు. కానీ… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారాంపురం పంచాయతీ పరిధిలోని అన్నారం, చింతలపాడుతో పాటు మరో మూడు గిరిజన గ్రామాల ప్రజల గుండెల్లో మాత్రం వణుకు మొదలవుతుంది. వారికి వర్షం అంటే పరవశం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 149907