Tuesday, June 30, 2026
News Navigation
Tuesday, June 30, 2026
News Navigation

Breaking

Tuesday, June 30, 2026
Home Telangana బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ విషయంలో యువతతో ఆడుకుంది

బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ విషయంలో యువతతో ఆడుకుంది

by Satya
బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ విషయంలో యువతతో ఆడుకుంది

గత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని సంవత్సరాల కొద్దీ సాగదీసిందని, నోటిఫికేషన్ల దశలోనే కొన్నేళ్ల పాటు ఉంచారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన కొలువుల పండుగ కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన ఒక వెయ్యి 635 మందికి నియామక పత్రాలు అందజేశారు. వివిధశాఖల్లో ఉద్యోగాలు పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇంజనీర్ల కృషి గొప్పతనం ఈ సమాజానికి చాలా అవసరమన్నారు. కేసీఆర్‌, ఆయన కుటుంబంలోని వారి ఉద్యోగాలు పోతేనే పేదలకు ఉద్యోగాలు వస్తాయని ఆనాడు చెప్పానన్న రేవంత్‌రెడ్డి.. తాను చెప్పినట్టే కేసీఆర్‌ ఉద్యోగం పోయిన తర్వాత.. ఇప్పుడు పేదలకు ఉద్యోగాలు వస్తున్నాయన్నారు.

మూసీ అంటే మురికి కూపమనే పేరు స్థిరపడిందన్నారు. ప్రజలు నిరాశ్రయులు అవుతారని ప్రాజెక్టులు కట్టకుండా ఉంటారా? మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ, గంధమల్లు రిజర్వాయర్ల నిర్మాణం వల్ల ఎవరి భూములూ పోలేదా? అని ప్రశ్నించారు. మల్లన్నసాగర్‌ పేరుతో రైతులను బలవంతంగా ఖాళీ చేయించారని.. మూసీ నిర్వాసితులకు మంచి స్థలంలో ఆశ్రయం కల్పిస్తామన్నారు. నిర్వాసితులను ఎలా ఆదుకోవాలో సలహాలు ఇవ్వాలని రేవంత్‌రెడ్డి కోరారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

036104
Total views : 180826

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.