Friday, August 14, 2026
News Navigation
Friday, August 14, 2026
News Navigation

Breaking

Friday, August 14, 2026
Home Andhra Pradesh పోలీసులకు సవాలుగా వీఆర్వో మల్లికార్జునరావు మిస్టరీ

పోలీసులకు సవాలుగా వీఆర్వో మల్లికార్జునరావు మిస్టరీ

by Satya
పోలీసులకు సవాలుగా వీఆర్వో మల్లికార్జునరావు మిస్టరీ

పల్నాడు జిల్లా ముప్పాళ్ళ మండలం నార్నేపాడు వీఆర్వో మల్లిఖార్జున్ రావు మిస్టరీ పోలీసులకు సవాల్ గా మారింది. ఆర్థిక బాధలు, ఇష్టం లేని వివాహం వంటి కారణాలతో ఇంటి నుండి వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మల్లికార్జున రావు స్వగ్రామం ముప్పాళ్ళ మండలం పలుదేవర్లపాడు. సెప్టెంబర్ నెల 30వ తారీకున ఇంటి నుంచి వెళ్లిపోయాడు. రెండు నెలల క్రితం వీఆర్వో కు సమీప బంధువుల అమ్మాయితో వివాహం జరిపించారు. ఇష్టం లేని పెళ్లితో మనస్తాపం చెంది సూసైడ్ నోట్ రాసి ఇంటి నుండి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు శ్రీశైలం మరియు మరికొన్ని పుణ్యక్షేత్రాలలో వీఆర్వో మల్లికార్జున రావు కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తమ బిడ్డ ఏమైపోయాడోనని కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరుసగా జరిగిన చైన్ స్నాచింగ్ కేసులను పోలీసులు ఛేదించారు. కేసులకు సంబంధించి ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేయగా.. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో…
  • రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.
    కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగా పార్టీకి సంబంధించిన అంశాలపై మాట్లాడటం సబబు కాదని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను సీరియస్‌గా పరిగణిస్తున్నామని.. ఈ వ్యవహారంపై హైకమాండ్ దృష్టి కూడా ఉందన్నారు.…
  • ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.
    అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ఈ నెల 25న రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. కనేకల్-1, కనేకల్-2 పేర్లతో ఏర్పాటు చేయబోయే పవన విద్యుత్ ప్రాజెక్టులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో…
  • సింహాచలంలో వైభవంగా శ్రావణ శుక్రవారం పూజలు.
    విశాఖపట్నం సింహాచల పుణ్యక్షేత్రంలో శ్రావణమాసం తొలి శుక్రవారం సందర్భంగా ఆధ్యాత్మిక సందడి నెలకొంది. శ్రీ సింహవల్లి తాయారు సన్నిధిలో లక్ష కుంకుమార్చన పూజలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రావణమాసంలో తొలి శుక్రవారం అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజుగా భావిస్తుండటంతో.. ప్రత్యేక పూజలకు భక్తులు…
  • బాలానగర్‌లో గంజాయి ముఠాపై తెలంగాణ ఈగల్ భారీ ఆపరేషన్.
    హైదరాబాద్ బాలానగర్‌లో గంజాయి ముఠాను పట్టుకునేందుకు వెళ్లిన తెలంగాణ ఈగల్ పోలీసులకు ఊహించని ప్రతిఘటన ఎదురైంది. నిందితులు పోలీసులపై కుక్కను వదలడంతో పాటు స్క్రూడ్రైవర్‌తో దాడికి పాల్పడ్డారు. అర్ధరాత్రి ప్రారంభమైన ఈ ఆపరేషన్‌లో నిందితుడు పక్క భవనాలపైకి దూకుతూ తప్పించుకునే ప్రయత్నం…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: